కలావతికథ.
49
యెఱిఁగి యట్టి పేరు బెట్టెనా యేమి ? చెప్పుఁడని యడుగుటయు నవ్వుచు నయ్యతి యిట్లనియె.
వత్సా! అంతకు మున్నా దేశంబున ననావృష్టిదోషంబు గలిగి యాబాలుఁడు జనించినతోడనే వర్షముగురిసినది. దానంజేసి పండితుండగు నాపాఱుండు వానికి నుదకము నిచ్చినవాఁడని యర్ధమువచ్చునట్లుగా నారదుఁడని పేరు పెట్టెను. అంతియకాని యతండు నారదుని యవతారమని తెలిసికాదు. తెలిసినదా. తరువాత వినుము.
కలావతియు బుత్రలాభంబున భర్తృవియోగశోకంబు గొంత మఱచి తల్లాలనావినోదములతో నొకరీతిఁ గాలక్షేపము సేయుచుండెను. ఆబాలుండును. ననుదిన ప్రవర్ధమానుండగుచుఁ బూర్వజన్మోపాసిత విష్ణుమంత్రంబు మాటలతోనే నేర్చికొని జపించుచు విజ్ఞానయుక్తుండై
సీ. ధూళిధూసరితగాత్రుఁడుగాఁగ నడివీధి
నాడుచు భక్తియై హరిని బాడు
ధూళిప్రోగిడుచు గోపాలవిగ్రహముగాఁ
బూజించు ధూళిచేఁ బూవులనుచు
బుధులు వీధి బురాణములు విష్ణుగాథలొ
య్యనఁ బఠింపఁగఁజేరి యాలకించుఁ
బఠియింపఁజేయు శ్రీపతిమంత్రముల ధూళి
వ్రాయుచుఁ దనతోడి బాలకులను
గీ. చూడ బోయినవారింటి గోడలందు
వాసుదేవునిప్రతిమల వ్రాయుచుండు
తల్లిచంకనయుండి గాత్రములనిండ
గీట్లుగా గీయు హరిమంత్ర కీర్తనముల.
ఉ. ఏమిరవత్స! యందుఁబనియేమి యొనర్చుచునుంటి విందు రా
వేమిరవేగ బువ్వ భుజియింతువుగాకని తల్లి పిల్వ న