పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/408

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుక నారద సంవాదము.

399

సుఖమను పేరుగల దు:ఖములో సర్వదా మునింగి తేలుచుండును.

స్వకర్మములచేఁ గట్టఁబడి కవ్వమువలె సంసారచక్రంబునఁ ద్రిప్పఁబడుచు ననేకబాధలం బొందుచుండును. కావున వత్సా! నీవు బంధంబులఁ ద్రెంపికొని కర్మల విడిచి నిజుమెఱింగి భావశూన్యుండవై సిద్ధింబొందుము. సంయమనంబున బంధముల ద్రెంపికొని సుఖోదయమై బాధాశూన్యమై యొప్పు సిద్ధిని ననేకలు పొందియున్నారు.

మహాత్మా! శోకోపహతికొఱకు శాంతికరమైన శాస్త్రముల వినినచో మంచిబుద్ధిగలుగును. అట్టి బుద్ధిబొందిన జనుండు సుఖవంతుఁడగును. ప్రతిదినము శోకస్థానసహస్రములు భయస్థానశతములుమూర్ఖుని బొందుచుండును. పండితుఁడు వాని గణింపఁడు. కావునఁ దండ్రీ! యనిష్టనాశనమునకై మదీయోపన్యాసమును వినుము, బుద్దీని వశము జేసికొనినవానికి శోకము నశించును. స్వల్పబుద్ధులు ఇష్టనాశనమునకై వగతురు. భూతములను గుణములు పొందుచున్నవి. విడిపోవుచున్నవి. వానిగుఱించి విచారించిన లాభములేదు.

మృతునిగుఱించి నష్టమును గుఱించి యతీతమైనప్పుడు విచారించుటవలన దుఃఖమేయగును. లోకప్రచారము దెలిసికొనిన నశ్రు మోచనముచేయఁడు. పెక్కేల సమస్తము లెస్సగాఁ జూచువానికి నశ్రుబిందు వైనరాఁజాలదు. వినుము. దుఃఖోపఘాతుకంబగు శరీరధర్మంబునందును మనోధర్మంబునందును నుండువానికి దుఃఖము రాకుండ మానునాయందువేమో! తగిన యత్నము జేసి దానిందలంపఁగూడదు. దుఃఖమునకు వైద్యము తలంపకుండుటయే. చింతించుచున్న వాని శోకము క్రొ త్తదియై వృద్ధిపొందుచుండును. ప్రజ్ఞచే మనోదుఃఖమును ఓషధులచే శరీరదుఃఖమును బోగొట్టుకొనవలయును. విజ్ఞానసామర్థ్య మన నిదియేకదా! లేనిచో శిశువులవలె రోదనము జేయుదురు.

లోకము, యౌవనము, రూపము, జీవితము, ద్రవ్యము, ఇష్ట