పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/401

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

392

కాశీమజిలీకథలు - పదియవభాగము.

చ. జలనిధులేడునుంగలఁగె సప్తకులాచలముల్ జలించె ది
    క్కులఁ బొగగ్రమ్మెవే తిరిగెఁ గుమ్మరిసారెగతిం ధరిత్రి వ్యా
    కులపడె నెల్లదేవమునికోటు లేదేమి? యయో? యకాలపుం
    ప్రళయమటంచు నారద తపః ప్రభవానల దహ్యమానులై .

అయ్యకాండ ప్రళయంబునకు వగచి హాహాకార రవంబులు సేయుచు ముప్పదిమూడుకోట్ల వేల్పులు దిక్పతులు సేవింప నింద్రుఁడు పరమేష్ఠికడ కరిగి యయ్యుపద్రవ ప్రకారం బెఱింగించుటయు నా సృష్టికర్త వారినెల్ల వెంటఁబెట్టికొని నారదునొద్దకుంబోయి వత్సా! నారద ! నీతపంబు లోకంబులం బీడింపుచున్నది. నీయభీష్టంబు దెలిపి వరంబులంది తపం బుపసంహరింపుమని పలికిన నతనిమాట వినిపించు కొనక యధాప్రకారంబు తపంబు గావింపుచుండెను.

అప్పుడు బ్రహ్మ యా దేవసమాజముతోఁగూడ శంకరు నొద్దకుంబోయి నారద తపః ప్రవృత్తిం దెలుపుటయు నమ్మహాత్ముండు వారెల్ల దనవెంటరా నత్తపోధన సత్తముని సవిధంబున కరిగి బోధించుచు నిట్లనియె.

క. యతివర యేమిటికి ట్లు
   గ్రతపంబొనరింపుచుంటిఁ గడువడి లోక
   త్రితయముచలింప నీకా
   మితమదియేమియొ వచింపుమీ యిత్తుననన్ .

మహేశ్వరున కేమియుఁ ప్రత్యుత్తర మీయక నారదమహర్షి తపంబు విరమింపఁడయ్యె నప్పుడయ్యుమాపతి యెల్ల వేల్పులతోఁగూడ వైకుంఠంబున కరిగి రమాధవున కయ్యుదంత మెఱింగించె నప్పుడా శ్రీమన్నా రాయణుండు లక్ష్మీసహితుండై బ్రహ్మరుద్రాదులతో నారదమహర్షి యొద్దకుబోయి తచ్ఛిరంబునఁ దనకరంబిడి,