నారదుని స్వస్వరూపప్రాప్తి.
379
గావింపుచుదారుణశోకావేశంబునమే నెఱుంగక నేలఁబడి మూర్చిల్లినది.
ఆ యుపద్రవవార్త కోటలోనున్నవా రందఱకు దెలిసినది. అంతఃపుర స్త్రీలందఱు మహా దుఃఖావేశంబుతో బ్రాణబంధువుల మరణములకు దుఃఖించుచుఁ గటారులఁ బొడుచుకొనువారును దాదులచేఁ బొడిపించుకొనువారును నూఁతులం దూకువారును అగ్నిలోఁబడు వారు మెడ కురిబోసికొనువారునై రెండు గడియలలో రాజస్త్రీ లందఱు దేహత్యాగము గావించుకొనిరి. వారి పాటుజూచి దాసదాసీ జనంబులు బలవంతముగనే హత్యలు గావించకొనిరి. అంతలో నా రక్కసుఁడు కోటలోఁ బ్రవేశించి మిగిలిన శిశు బాలవృద్ధులఁ గ్రుద్ధుడై నెత్తిపై గ్రుద్దుచుఁ బెద్దనిద్దుర నొందఁజేసెను.
మఱియు రక్కసులెల్ల నాకోట గొల్లకొట్టి పాతాళలోకము నుండి రాజకుమారులు తెచ్చిన రత్నములు, మండనములు, బంగారము నంతయు నెత్తికొని యాకోట పాడుపదడుచేసి తిరుగాఁ బాతాళలోకమున కరిగిరి.
అని యెఱిఁగించునంతఁ బ్రయాణసమయ మగుటయు నయ్యతి పతి యవ్వలికథ పై మజిలీయం దిట్లు జెప్పందొడంగె.
- ___________
244 వ మజిలీ.
నారదుని స్వస్వరూపప్రాప్తి.
క. పెద్దతడ వొడలు తెలియక
ముద్దియపడి కొంతవడికి మోహంబుడుగన్
దద్దయు విలపించెను బలు
సుద్దులఁ బుత్రుల దలంచి శోకము హెచ్చన్.