370
కాశీమజిలీకథలు - పదియవభాగము.
గీ. వనధి నాపోశనముగ నెవ్వాఁడు గ్రోలె
సతత మేముని దక్షిణాశను వసించు
నయ్యగస్త్యుండు సర్వసంయములయందు
నగ్రగణ్యుం డటంచు నాయభిమతంబు.
వారుణి — అక్కా! ఆమాట కాదనువారెవ్వరు?
గంధ:- ఆహా! ఆమహానుభావుండు గావించిన పనులు దేవతలకు గూడఁ శక్యమైనవియా? అతని సర్వాధికుం డనుటకు సందియమేలా?
చంద్ర – మధుమతీ! అగస్త్యమహర్షి యెట్టిపనులనైనఁ జేయ నీ యహంకారసక్తుడగుట సర్వాధికుండనుటకు నేనొల్ల.
క. పుత్రులు తిమూర్తులును క
ళత్రం బనసూయ శాంతలలితాత్ముండా
యత్రిమహామునికన్నఁ బ
విత్రుండగు తపసిగలఁడె వెదకిన నెందున్.
రత్నావతి -- మహాపతివ్రతా శిరో మణియగు ననసూయా మహాదేవికిఁ బ్రాణవల్లభుండైన యత్రిమహర్షి యే యుత్త ముండని నాకును దోచుచున్నది.
ప్రభావతి — నా యభిప్రాయము నట్టిదే.
ప్రమద్వర — అక్కలారా! వీరిద్దరికన్నను బ్రహ్మమానస పుత్రుండగు మరీచికుమారుండు కశ్యపుని నుత్తముండని చెప్పినఁ దప్పు పట్టెదరా? వినుండు
గీ. అదితియుదున వేల్పులను దితియందు
దానవులనెల్లఁ గనిన ప్రధానమూతిన్
వనజభవు పట్టిపట్టి వామనుని తండ్రి
కశ్యపునికన్న కథికుఁ డొక్కరుఁడు గలఁడె.