పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/379

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

370

కాశీమజిలీకథలు - పదియవభాగము.

గీ. వనధి నాపోశనముగ నెవ్వాఁడు గ్రోలె
    సతత మేముని దక్షిణాశను వసించు
    నయ్యగస్త్యుండు సర్వసంయములయందు
    నగ్రగణ్యుం డటంచు నాయభిమతంబు.
    వారుణి — అక్కా! ఆమాట కాదనువారెవ్వరు?

గంధ:- ఆహా! ఆమహానుభావుండు గావించిన పనులు దేవతలకు గూడఁ శక్యమైనవియా? అతని సర్వాధికుం డనుటకు సందియమేలా?

చంద్ర – మధుమతీ! అగస్త్యమహర్షి యెట్టిపనులనైనఁ జేయ నీ యహంకారసక్తుడగుట సర్వాధికుండనుటకు నేనొల్ల.

క. పుత్రులు తిమూర్తులును క
   ళత్రం బనసూయ శాంతలలితాత్ముండా
   యత్రిమహామునికన్నఁ బ
   విత్రుండగు తపసిగలఁడె వెదకిన నెందున్.

రత్నావతి -- మహాపతివ్రతా శిరో మణియగు ననసూయా మహాదేవికిఁ బ్రాణవల్లభుండైన యత్రిమహర్షి యే యుత్త ముండని నాకును దోచుచున్నది.

ప్రభావతి — నా యభిప్రాయము నట్టిదే.

ప్రమద్వర — అక్కలారా! వీరిద్దరికన్నను బ్రహ్మమానస పుత్రుండగు మరీచికుమారుండు కశ్యపుని నుత్తముండని చెప్పినఁ దప్పు పట్టెదరా? వినుండు

గీ. అదితియుదున వేల్పులను దితియందు
    దానవులనెల్లఁ గనిన ప్రధానమూతిన్
    వనజభవు పట్టిపట్టి వామనుని తండ్రి
    కశ్యపునికన్న కథికుఁ డొక్కరుఁడు గలఁడె.