24
కాశీమజిలీకథలు - పదియవభాగము.
నామణికాంచనోరుభవనంబుల సౌధములందు సంత తే
చ్ఛామహితప్రచారముల సౌఖ్యములందుచు నొప్పుగావుతన్.
తక్కినవారింగూడ నట్లే పేర్కొనుచుఁ గీర్తించినది. అప్పుడు,
క. మ్రోగించిరి దుందుభులు న
భోగులు గురిపించి రపుడు పూవులవానల్
యోగులు దీవించిరి సు న
భాగులు, వినుతించిరిష్ట పడి దంపతులన్.
అప్పుడు చిత్రరథుండు సఫలీకృతమనోరధుండై యుమామహేశ్వరులం బ్రార్థించి యింద్రాదిబృందార కుల వేడికొని రత్న కేతు సకుంటుంబముగా రప్పించి యయ్యుత్సవము పరిణయోత్సవముగా మార్పించి యామంటపంబు వివాహవేదికగాఁ జేసి తన కూతుండ్ర నేబదుగురనయ్యుపబర్హణున కిచ్చి వివాహము గావించెను. అయ్యు'త్సవానంతరమున దంపతులం దీవించి దేవతలెల్ల దమతమ నెలవులకుఁ జనిరి. రత్న కేతుండును కుమారుండును కోండండ్రును వెంటరా చిత్రరథు చేననిపించుకొని స్వనిలయంబునకుం జనియె.
ఉపబర్హణుఁ డే బదుగురు భార్యలతో విమానమెక్కి.. తిరుగుచు భక్తిరసము మూర్తీభవించినట్లా విపంచిపై శ్రీహరిఁగీర్తించుచు శృంగారరసము తనువుగైకొని నట్లాచేడియలతో, గ్రీడాశైలముల సుందరోద్యానవనములఁ కొలకుల కెలకులఁగాసారతీరముల నదీపులినంబుల మనోభవకళా వైదగ్ధ్యంబు తేడపడ సప్పడతులతో బ్రహ్మానంద సదృశమగు సుఖం బనుభవించుచుండెను. అని యెఱింగించునప్పటికిఁ గాలాతిపాతమైనది. తదనంతరోదంత మవ్వలిమజిలీయందిట్లు చెప్పం దొడంగె.
- __________