340
కాశీమజిలీకథలు - పదియవభాగము.
క. మీరా జాఁడుదియని విని
నారముగద పురుషుఁడయ్యెనా యిపు డక్కాం
తారత్నం బట్లైనం
బోరం గనుఁగొందు వాని భుజబలమిహిహీ.
అని పలుకుటయు మేమదలించి వానిం బట్టికొనఁ బ్రయత్నించితిమి. స్వామి ! వాఁడు మాకు లొంగువాఁడుకాడు. చేతనున్న బెత్తముతోనే మమ్ముఁ గాందిశీకులఁ గావించెను. ఆదెబ్బలఁ దిని పారిపోయివచ్చితిమని యెఱిఁగించినఁ బక్కున నవ్వుచు నౌరా ! ఈ రాజ్యంబున మంచివీరులున్నారు గద. రాజునానతినొక్కరుఁడు లెక్క సేయఁడు. ఆఁడురాజ్య మాఁడురాజ్యముగానే యున్నదని రత్నమకుట నాక్షేపించుచు వారిరువురబలము రేపు గనుంగొనియెదఁగాక. తెల్లవారకమున్న పదుగురసాదుల నిందుండునట్లు నియమింపుము. నానిమిత్త ముత్తమాశ్వ మొకదాని నాయత్తపరచి యుంచుమని మంత్రికి నియమించి పుష్ప కేతుఁడు భార్యతోఁగూడ నతఃపురమున కరిగెను.
అని యెఱింగించునప్పటికి వేళ యతిక్రమించినది. పై కథ యవ్వలిమజిలీయం దిట్లు చెప్పందొడంగెను.
241 వ మజిలీ.
మణిమతుఁ డల్లునితో నగరిలోజరిగిన కథయంతయుం జెప్పి గడ్డముపట్టికొని బాబూ! నామాట వినుము. బలవద్విరోధమువలదు. రాజు చాలమంచివాఁడు. రత్న పాదునిమాటలు విని యతని నాక్షేపించుచు నీపక్షమే వాదించెను. నీవు తనకడకు వచ్చితివికావను కోపముతప్ప మఱేమియును లేదు. ఒకసారి పోవుదమురమ్మని బతిమాలిన నవ్వుచు నతండు మామా! నాసామర్థ్యము నీవెఱుంగక వగచుచున్నావు. అతండు నన్నేమియుఁ జేయఁజూలఁడు. నాకంటె బలవంతులగు నాసోదరులు నలువు రీయూరనున్నారు. అంతయవసరమువచ్చి