పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/326

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాజరత్నముకథ.

315

పుష్ప - అదియే నీవలన నాకు గావసినపని. వానిం దెచ్చి చూపఁగలవా?

రత్న - రేవు సాయంకాల మీపాటివేళకు రండు. ఆకట్ట తెచ్చి మీకిచ్చివేసెదను. యిదియేనా మీపని.

పుష్ప -- అవును. నేను బోయివత్తు. మఱుతువుసుమీ.

అని చెప్పి యతండు బసలోనికిం బోయి మఱునా డావేళకే దానియింటికిఁ బోయెను. రత్న కేసరి యాకట్ట యతని ముందరం బెట్టినది. ద్రవ్యంబునకు సాధ్యము కానివా రుండరుగదా.

పుష్ప కేతుండు ప్రశ్నోత్తరములతో నొప్పుచున్న యా పత్రికలన్నియుం జదివి యందలి రహస్యములు కొన్ని తెలిసికొని దాని కిట్లనియె. రత్న కేసరీ ! మొదట నీవు పల్లవాంకురము తరువాత మాలతి పిమ్మట జూతమంజరి. తరువాత గోళ్లునాటించిన యెఱ్ఱగుడ్డచుట్టిన మైనము ముద్ర పిమ్మట నల్లగడ్డచుట్టిన తామలపాకులు నతని యొద్దకుఁ దీసికొనిపోయి యిచ్చితివి జ్ఞాపకమున్నదా ? అని యడిగిన నది ఔను. ఇచ్చితిని. వాని కతండు తగుసమాధానము చెప్పలేక పోయెనఁట. అతండును సామాన్యుడు కాడు. నీవోడితివని చెప్పినప్పు డెదరించి బెదరించి కత్తితీసి నరికెదనని పలికెను. పిమ్మట నాపొన్నికొమ్మ ఏదో పుస్తకము జూచి కొన్ని శ్లోకములు వ్రాసియిచ్చినది. వానిం జదివికొని మఱుమాట పలుక తోటలోనికిఁ బోయెనని చెప్పినది.

అవును రాజరత్నము తానడిగిన ప్రశ్నమును శాస్త్రసమ్మతములే యని దృష్టాంతము చూపినది.

శ్లో. నారీసం కేతకం వక్ష్యె వక్రభాషాంగముద్రయోః
    పోటలీవస్త్రపుష్పాణాం తాంబూలస్యావ్యనుక్రమాత్ .

అను శ్లోకముమాత్రము జదివి రత్న కేసరీ ! నీదయవలనఁ