పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/319

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

కాశీమజిలీకథలు - పదియవభాగము.

క. మీయన్నలగతి మీరును
   శ్రీయుతులై వచ్చి నేను ప్రియమంద నతుల్
   సేయుదురని యెడదం దల
   పోయుదు నెల్లపుడు రిత్తవోయె మదాశల్ .

గీ. ఏల పోయితిరయ్య మీరెఱిఁగి యెఱిగి
   క్రోధనుని యంత్రశక్తి రాకొమరులార!
   అంబుధి నిమగ్నమూర్తులైనప్పు డెంత
   యార్తిజెందితిరో బిడ్డలార మీరు.

అక్కటా! పెక్కండ్రు బిడ్డలు పుట్టుటయు రట్టున కే కారణమైనది. ఱెక్కలువచ్చిన పక్షులవలె బిడ్డలు జెప్పియుఁ జెప్పకయు నలుమూలలకుం బోయిరి. తూర్పుదెస కరిగిన వారు మాత్రము కష్టములు దాటి గట్టెక్కి వచ్చిరి. యుత్తరముదెస కరిగిన వారి సౌకర్యవార్త దెలియుచున్నది. కాని యింకను నింటికి రాలేదు. వారిట్లు సముద్రముపాలైరి. కడపటివా రేవురు దండ్రియాజ్ఞ బూనకయే దక్షిణముదిక్కున కరిగిరఁట. ఎవ్వరికై వగతును ఏమి సేయఁగలను? ఆసముద్రము లోతైనదే కాఁబోలు. శ్రీముఖా! నన్నక్కడికిఁ దీసికొని పోవుదువా! సముద్రములో మునింగి నాబిడ్డలం జూచెదగాక, అని యూరక వారలం దలంచి సౌభాగ్యసుందరి దుఃఖించుచున్నది. అట్టి సమయంబున విమాన మామేడమీఁదికి దింపి విక్రమాదులు దిగివచ్చి

గీ॥ జలధిఁబడియు దైవసంకల్పమునఁజేసి
     బ్రతికినార మొక్క భంగి మేము
     చూడు వీరె నీదు సుతు లుత్తరాశకు
     ౙనినవారు వారి సతులు వారు.

వీరు మా భార్యలు దేవకన్యలు. వీడు విద్యాసాగరుని కొమారుఁడు. నీమనుమని జూచికొనుమని పలుకుచు వారినెల్ల దెల్లముగా