260
కాశీమజిలీకథలు - పదియవభాగము.
గరుడుఁడు మీ మనుమనింజూచి స్వయముగా నే కోరికొనియెను. వలదనుటకు మాకు సామర్ధ్యముగలదా! ఇందు మా తప్పులేదని వారుత్తరము చెప్పిరి. తపోధనసత్తమా! మా సుముఖున కిఁకఁ బదిదినములు మాత్రమేయాయువున్నది. ఇట్టి వానికిఁమీరు పెండ్లిచేయుమని యడిగిననేనేమి సమాధానముచెప్పఁగలననిగోలు గోలుననేడువఁదొడంగెను.
సీ! సీ! శ్రీవిష్ణునికి వాహనమై కశ్యపునకుఁ గుమారుఁడై యొప్పు పక్షిపతి కించుకయు జాలిలేకపోవుట కడుంగడు శోచనీయమై యున్నదని నారదమహర్షియతనిగర్హించుచు మాతలిదిక్కు, మొగంబై యిందుల కేమందువని యడిగిన నతం డిట్లనియె. స్వామీ! మీయనుగ్రహముండిన గరుడుండు సుముఖు నేమిజేయఁగలఁడు! ఈసుముఖుని మన మిప్పుడు స్వర్గమునకుఁ దీసికొనిపోవుదము. మహేంద్రునితో నితనికథ జెప్పి యీముప్పు తప్పింపుమని వేడుకొందము. అతం డుపేంద్రుని ముఖముగా గరుడునకుఁ జెప్పించిన నంగీకరింపక పోవఁడు. గరుత్మంతుం డెంతబలవంతుండైనను నుపేంద్రునియాజ్జు నుల్లంఘింపఁ గలఁడా? ఇదియే కర్తవ్యమని నాకుఁ దోచినదని చెప్పిన నారదుండు సంతోషించి యార్యకుని కావార్త దెలియఁజేసెను,
ఆర్యకుఁడు మిగుల సంతోషించుచు మనుమని వెంటఁబెట్టికొని యాక్షణమందే వారివెంట నాకంబున కరిగెను. అని యెఱింగించి... ఇట్లు చెప్పందొడఁగెను.
- __________
235 వ మజిలీ.
సుముఖునికథ.
ఆర్యకుఁడు సుముఖుని వెంటఁబెట్టుకొని చుట్టములతోఁగూడ మాతలివెంట స్వర్గమున కరిగెనని విని భోగవతీనగరంబునంగల నాగ ప్రముఖు లొకనాఁడు సభచేసి యిట్లు సంభాషించుకొనిరి.