దేవకన్యలకథ.
245
బోయిఅమ్మవారివెనుక పాదపీఠముక్రిందనణఁగిపండుకొని చూచుచుండెను
అంతలో నా కాంతారత్నములు జలకమాడి పుట్టంబులంగట్టికొని గుడిచుట్టును ముమ్మారు ప్రదక్షిణములుసేసి మోడ్పు చేతులతో నాలయములోఁ బ్రవేశించి సాష్టాంగ నమస్కారములు గావించి లేచి శ్రేణిగా నిలువంబడి మనోహర స్వరగీతంబుల నమ్మహాదేవినిట్లుస్తుతియించిరి.
మాలిని. జయజయ సురమస్త స్థాన విన్యస్త భూషా
చయ మణినిక రోస్ర స్ఫారభాస్వత్పదాబ్జె
జయజయ శ్రుతి మాతః సర్వలోకైకపూజ్యె
జయజయ నిజభక్త స్తావకాసక్త చిత్తె॥
శ్లో॥ బ్రహ్మాసి వాంఛతి తధైవ హరో హరశ్చ
సేంద్రాః సురాశ్చ మునయో విదితార్థతత్వాః
యద్దర్శనం జనని తేద్యసదా దురాపం
ప్రాప్తం వినా శమదమాదిభి రంబ సత్యం.
ధ్యానానంతరమున నత్తరుణులు నలువురు తత్పాద పీఠము మ్రోల శ్రేణిగాఁ గూర్చుండి నిర్మాల్యంబు తబ్బిబ్బగుటకు శంకించు జొనుచుఁ గాలిచే నట్లైనదని సమాధాసపడిఁ క్రమంబున నమ్మహాదేవిని షోడశోపచారములచేఁ బూజించి మంగళ గీతంబులంబాడి లేచి నిలువంబడి చేతులు జోడించి యిట్లు ప్రార్థించిరి.
సీ. ప్రతిశుక్రవారంబు రాత్రియిం దరుదెంచి
యతిభ క్తి జాగరవ్రతముసలిపి
గురునాజ్ఞ నాఱువత్సరములనుండి ని
న్నర్చించుచుంటిమో యంబమేము
రాఁబోవు శుక్రవారముతోడ వ్రతము పూ
ర్ణంబగు మాయభీష్టము నెటుల
తీర్చుదానవొ? మహాదేవి! గాయత్రి! ని
న్నే నమ్మియుంటిమో నిగమజనని