పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/248

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవకన్యలకథ.

235

తరంగములుగాక మఱియేమియుంగానక తన్ను మృతప్రాయునిగాఁ దలంచికొని యిట్లు ధ్యానించెను.

సీ! పురుష కారము ప్రధానముగాఁజేసికొని కార్యములు సేయ బూనెడు వారాపదలఁ బొందకమానరు. మేము ప్రతాపగర్వితులమై క్రోధనుండు యంత్రబలయుక్తుఁడు, యందుఁ బోవలదని యెందఱుచెప్పినను వినిపించుకొనక బయలుదేరుట మాకండక్రొవ్వుగాక మఱియేమి? క్రోధనుండు మా జోలికివచ్చెనా ! మమ్ము నిదించెనా ! అకారణ వైరముఁబూని పోరఁబోయిన నాపదలు జెందకుండునా ? క్షత్రియ ధర్మమే గర్హితమైనదని తలంచెదను. మా యోడలలో నొక్కటి యైన మిగిలినట్లులేదు. మేమన్నదమ్ములము నలువురమేకాక మా నిమిత్తము శ్రీధరుని బలములుగూడ సముద్రముపాలైనవి. మా యన్న కీ వార్త జెప్పువారెవరైనలేరు. మా జీవిత మీసముద్రజలంబుల ముగిసినది. దరిజేరుట కల్ల. ఆహా! కాలమెంతలో మారినది. జాముక్రిందట నోడమీదఁ గూర్చుండి మిత్రులతోఁ గ్రోధనుం జయించు నుపాయమేమని యాలోచించు చుంటిని. ఇంతలో నాజీవితమే యస్థిరమైనది. నన్నీ దోనెతోఁగూడ నే జలచరమో భక్షించును. నాకిఁక యాయువు గడియ యో రెండు గడియలోనున్నది. ఇఁక పరమేశ్వరునిధ్యానించుటయే లెస్స. ఐహిక విషయంబులం దలంచిన ఫలములేదని నిశ్చయించి కన్నులు మూసికొని యిష్టదేవతనిట్లు స్మరించెను.

ఉ॥ ఏమియుఁజేయనట్టి పరమేశ్వరు సన్నిధిఁజేరి తత్ప్రస
      క్తామల దీప్తిలాగికొని యన్నియుఁ దా నొనరించుచుండి మా
      యామయమైన లోకములనాతఁడె కర్తగ దోపఁజేయు సా
      ధ్వీమణి నాదిశక్తిఁ బ్రకృతిన్ బ్రణుతింతున నంత భక్తితో.

అని స్తుతియించి తదర్ధ మవఘటించుకొని అయ్యోనేను భక్త