220
కాశీమజిలీకథలు - పదియవభాగము.
జనవలె నింక లెమ్మనుచు ఛాత్రునితోఁ దదనంతర ప్రదే
శనిలయమేగి చెప్పె సరసంబుగ నవ్వలివార్త గ్రమ్మఱన్॥
- __________
231 వ మజిలీ.
స్వగ్రామప్రయాణము.
తమ్ములారా! వినుండు కీడుగూడ మేలునకే యొకప్పుడు కారణమగుననుమాట మనయందు నిరూఢమైనది. అమ్మహావాత పాతంబున గుఱ్ఱముతోఁగూడ నేనాదెసకు గొట్టుకొనివచ్చి యీకోటగోడకు దగిలికొంటిని. మీకుఁబోలె నాకు మన గుఱ్ఱముజేసిన సహాయమె యీవైభవమునకుఁ గారణమైనది. కోటలోఁజేరిన పురుషులు స్త్రీలవలె నందున్నవారికిఁ గనంబడునట్లు కాశ్మీర దేశాధిపతి యొకసిద్ధు నాశ్రయించి వరముగాఁ బడసెనఁట! నన్నీ ప్రమద్వర యాడుదాన ననుకొని తన యంతఃపురమునకుం దీసికొని పోయినది. మత్సంపర్కంబున గర్భవతియైనది. ఇందున్న కన్యకలందఱు పురపోపసృత్తముల నెఱుంగని వారగుట మాక్రీడల తెరంగెఱుఁగలేక పోయిరి. ఇందున్న ముసలిది ప్రమద్వర గర్భచిహ్నముల గహించి నన్ను బెదరించుచు నామె తండ్రికి వార్త నంపినది. ఎవ్వఁడో పురుషుఁడు స్త్రీ వేషముతోవచ్చి నీపుత్రికం గలసికొనియెను. ఇప్పుడు గర్భవతి యైనది. నీకూఁతురు నామాట వినక సంతతము వానితో దిరుగుచున్నది. కాపాడుకొనుమని వ్రాసిన యుత్తరము జదివికొని ప్రమద్వర తండ్రి చతురంగబలములతోవచ్చి యీకోట ముట్టడించి నన్నుఁ బట్టుకొనుటకుఁ బ్రయత్నించెను. ఖడ్గప్రహారముల వారినెల్ల నేను కాందిశీకులగావించితిని. రాజు నా పరాక్రమము మెచ్చికొని యా సిద్ధుని యుపదేశమున నే నల్లుఁడగుట సంతసించుచు నాతో సంధి