202
కాశీమజిలీకథలు - పదియవభాగము.
కంటకపాషాణాదులవలన మేనులు జీరికొనిపోయి రక్తము గారుచున్నను లక్ష్యము సేయక యతి ప్రయాసముతో నాపర్వత మెక్కఁ దొడంగినవి.
ఆఘోటకముల పాటుజూచి మే మాత్రపడుచు నడుమనడుమ గుఱ్ఱములుదిగి యడ్డుపడిన కంటక లతాగుల్మాదుల నరికివై చుచు నాగచేయు రాల నేలఁదొర్లించుచు జీఱికొని పోయి రక్తముగారు వాఱువముల గాత్రములకు నాకుపసరు లంటించుచు వాని కాళ్ళు త్రోమి త్రోమి యలయికలుదీర్చి తటాంతరముల మొలచిన గరికిపరకల మేపించుచు రాత్రిపడినంత నిరవగుపాషాణతలంబులఁ బండికొని వేగించుచు నైదుదినంబులకుఁ బ్రాణావశిష్టులమైయాకొండశిఖర మెక్కఁగలిగితిమి.
అందునిలువంబడి దక్ష్మిణదిక్కంతయుఁ బరికించితిమి. ఇది యరణ్యము, ఇవి గ్రామములు, ఇవి గిరులను భేదమేమియుఁ దెలియఁబడ లేదు. పెద్దనదులు వెండితీగెలవలె జూపట్టినవి. అంతయుఁ బచ్చగా నలికికొని పోయినట్లు కనంబడినది. మఱియునగ్గిరికూటము శృంగాటకమువలె విశాలసమభూతల విరాజమానమై యొప్పుచుండెను. ఇందే వేని వింతలు గనంబడకపోవునా యని తలంచి గుఱ్ఱముల కలయిక తీరినవెంటనే యుత్తరముగాఁ బోవఁ దొడంగితిమి. పోవునప్పుడు.
సీ. ఈప్రసూనవిశేష మీక్షించితిరె? వన్నెఁ
బద్మరాగప్రభ పరిహసించె
నీపూవుతావి నాసాపర్వమొనరించెఁ
గంటిరే? మణికర్ణికల నెసంగి
యీఫలంబుల రుచులెఱిఁగితిరే క్రోలి
యమృతంపురుచిఁ గేరియవఘటించు
క్రొత్తపూఁదేనె యీకొమ్మనంటె భుజింత
మిటు రారెయళుల రేపుటకు ముందు