పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/185

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నీకూఁతురు గర్భవతియైనదఁట. అందున్న ముసలిది వ్రాసినది. అది మగవాఁడుకాడు. ఆడుది యేయనియు గర్భవతి యగుటకుఁ గారణము తెలియకున్నదనియు యేమేమో వ్రాసినది. ఈవరము మాట దానికి నేనుజెప్పలేదు. ఎవ్వఁడో యాకోటలోఁబ్రవేశించెను. వారికి స్త్రీవలెఁ గనంబడియెను. ఆముగ్ధ కేమి తెలియును? చీచీ! వసుప్రియుని మూలమున బంగారమువంటి పుత్రికను భ్రష్టజేసికొంటిని. అయ్యయ్యో! అతం డట్లు చెప్పినంతనే అది వెఱ్ఱి యూహయని యాక్షేపించక ముద్దులపట్టి నై దేండ్లు దాటకమునుపే యడవిపాలు గావించితిని గదా! సీ. సీ. నావంటిమూర్ఖుం డెందును లేఁడు. లేక లేక గలిగిన బిడ్డకుం దగిన మగనిం దేలేక యొకానొక మూఢునివశము జేసితిని. అని యనేక ప్రకారముల దుఃఖించుచు గోపము పట్టఁజాలక యప్పుడే గుఱ్ఱము నాయత్త పఱుపుండని నియమించి సముచితయోధ పరివృతుండై యాపురుషుం బరిమార్చుటకై యాయరణ్యమున కరిగెను.

క. అనియెఱిఁగించి యతీశ్వరుఁ
   డనుమోదముతోడ సమయమగుటయుజని గో
   పునితో నవ్వలినెలవునఁ
   దనరఁగ వినిపించెనిటు కథాశేషమొగిన్.

___________

225వ మజిలీ.

చిలుక మువ్వలకథ.

ఉత్తరదేశమున దేవకూటమను పర్వతము కూట సముల్లిఖిత గగనంబై యొప్పుచున్నది. అన్నగంబున కుత్తరభాగమున గిరివ్రజమను గొప్పపట్టణము యలకాపురసదృశంబై ప్రకాశించుచున్నది. అప్పురంబునకు దేవకూటమే మూడుభాగముల కోటవలె నొప్పుచున్నది. ఆశైలశిఖరమెక్కినవారు పక్షులై యెగిరిపోవుదురని జనశ్రుతి