156
కాశీమజిలీకథలు - పదియవభాగము.
నుకులీనచటుల ఘోటకఖురస్ఫుటిత భూ
రచితాస్తరణమందురాయుతంబు
గీ. మణిరుచిభ్రాజితానేక మంటపంబు
కాంచనాభ్రంలిహాంచితాగ్రప్రకాశ
మగు మహాసౌధవరమొక్క డతనికందు
భ్రాంతిగలిగించె నవ్వైజయంతమనఁగ.
ఆత్తురంగమ మామేడముంగలి ద్రాక్షపందిరికడ కరిగి నిలువంబడినంతఁ బెక్కెండ్రుతరుణు లరుదెంచి రందుఁగొందఱుకళ్లెము పట్టుకొనిరి. కొందఱు కై దండలిచ్చి యచ్చిగురుఁబోఁడిం దింపిరి. కొందఱు పాదుకలు దొడిగిరి, కొందఱు వింజామరల వీచిరి. కొందఱు క్రొత్త పుట్టంబుల గట్టించిరి. ఇట్లు సఖులుపచారంబులఁ గావింపుచుండ నంది కొనుచు నారాజకుమారుని కై దండగొని సఖీ ! వీరందఱు నాసఖురాండ్రే. మనము మేడమీదకుఁ బోవుదము రమ్ము. పాపము నీవు బడలియుంటివి. భుజంచి విశ్రమింతువుగాక యని పలుకుచుఁ నక్కలికి జిటికనవ్రేలుఁ బట్టికొని యతని మేడమీఁదికిఁ దీసికొనిపోయినది. ఆమె సఖురాండ్రందఱు నతని వింతగాఁ జూడఁదొడంగిరి.
విద్యాసాగరుఁ డా స్త్రీమండలమునుజూచి యాశ్చర్యమందుచు నయ్యారే! ఈతొయ్యలుల చరిత్రము కడు విచిత్రముగా నున్నది. వీరందఱు నన్ను స్త్రీఁగానే భావించుచున్నారు. కారణము తెలియదు. వీరికి నెనట్లగుపడుచున్నానేమో పరిశీలించెదంగాక అని తన్నుఁజూచుకొని తనరూతమున మార్పేమియుఁ గానక వారే పొరపడుచున్నారని నిశ్చయించెను. మఱియు నందున్న స్త్రీలకందఱకు నా సుందరియే యధికురాలని తెలిసికొని యాత్మగతంబుననిట్లుతలంచెను.
ఆహా! ఇది యింద్రజాలమో స్వప్నమో భ్రాంతియో కావలయును. ఇందున్న వారందఱు నన్ను స్త్రీగానే సంబోధించుచున్నారు.