పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/166

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరదిగ్విజయము.

153

బులఁ గోసియు శోకావేశంబున దచ్ఛోభావిశేషంబు లేమియు గ్రహింపలేక పోయెను. అప్పుడా యారామ వినోదంబు లతని మానసమున కాశ్చర్యము గలిగించినవి.

ఓహో ! ఇదియొక యుద్యానవనము. ఇందలి కుసుమవాసన అపూర్వనాసాపర్వముగావింపుచున్నవి. యేమహారాజో యిందుఁగాపురముండి దీనింగాపాడుచున్నాడని తోచుచున్నది. పోయిచూచెదం గాక అనియాలోచించు మెల్లనలేచి యావేదికకు ముమ్మారు ప్రదక్షిణముజేసి పూవులుజల్లి నమస్కరించుచు నటకదలి కుసుమఫలభారసమ్రతరు లతా విశేషములఁజూచుచుఁ బడమరగా గొంత దూరము పోయెను. అక్కడనొక తటాకము మధురజలపూరితమై యతని కొహ్లాదము గలిగించినది.

అతండందు స్నానముజేసియాప్యాయనముగా నీరు గ్రోలిఫలములచే నాకలియడంచుకొనియందొక చూత వృక్షముక్రిందఁ గూర్చుండి చల్లగాలిసేవింపుచు నందలి విశేషంబులం బరికించుచుండెను.

అప్పుడు పడమరదెస విక్కిలి దవ్వులో నెవ్వరో గుఱ్ఱమెక్కి తనదెసకు బరువెత్తుకొని వచ్చుచున్నట్లు కనంబడినది. అతండులేచి నిదానించిచూచి యోహో నేనీకోటలో దూకితినని యెఱింగినన్నుఁ బట్టుకొనుటకిట్లు వచ్చుచున్నారు కాబోలు కాచికొని యుండవలసినదే అనియాలోచించి మొలలోనున్న యడిదము సవరించి చూచుచుండెను. దాపునకువచ్చినకొలఁది యావాఱువముపై నున్న వారు పురుషులా స్త్రీలా అని యనుమానముగలిగినది, అంతఁబదినిమిషములలో వచ్చి యవ్వాఱువ మానృపకుమారునిచేరువ నిలువంబడినది. అందు

గీ. జారుజడ యర్ధచంద్రునిమారు నుదురు
    పెద్దకన్నులు లేగౌను ముద్దుమొగము
    గబ్బిగుబ్బలు గలిగి చొక్కపు మిటారి
    నారి యొప్పారె స్వారి చిన్నారిగతులా