148
కాశీమజిలీకథలు - పదియవభాగము.
తదధీశులను బ్రవిదారణంబునఁ గాంది
శీకులఁగావించి చేవమీర
శరణాగతుల నాత్మ శరణాగతులఁజేసి
దురభిమానులనెల్లఁ బరిభవించి
కప్పముల్గట్టి విక్రమగర్వితులకెల్ల
విజయవార్తలఁ దెసల్వెలయఁ జేసి
గీ. తనివిసనకంత నుత్త రాంతము గనంగ
దలఁచి చతురంగ బలసమేతముగా వెడలి
చనిరి ప్రాలేయనగపరిసర ధరిత్రి
కక్కుమారకు లధిక సాహసముతోడ.
పరమహిమాస్పదంబులగు నయ్యుత్తర దేశారణ్యంబుల సంచరించు చుండ నందలి వాతదోషంబునంజేసి పదాతులు రోగపీడితులై యొక్కరొక్కరుగా నీల్గుచుండిరి. మాతంగంబులు మదమెక్కి మావటీలఁ బరిమార్చుచుండునవి. గుఱ్ఱములు క్రమంబునక్షీణించుచుండెను. ఆదుర్దశంగనిపెట్టి యా రాచకుమారులు జనపదంబులకు మరలఁదలఁచు చున్నంతలో నొకనాఁడొక జంఝావాతంబు ప్రళయమారుతంబో యన శరవేగముగాఁ బాంసు దూషితమై వీవఁదొడంగినది.
ఆరాజపుత్రులప్పుడు భయపడుచుఁ దమతమ గుఱ్ఱములెక్కి యెక్కడికైన చాటునకుఁ బోవలయునని ప్రయత్నింపుచు భగ్నములైన శిబిరంబులఁ చెల్లాచెదరైన బలంబులఁజూచి పరితపించుచు నిలువఁజోటుగానక నిటునటు తిరుగుచుండ సముద్రతరంగమువలె నొక్క పెద్దగాలిత్రోవువచ్చి వారిని దలయొక చోటునకు గుఱ్ఱములతోఁగూడ నెగయఁజేసినది, అందు
−:విద్యాసాగరునికథ:−
విద్యాసాగరుండా వాతఘాతంబున వాఱువముతోఁగూడఁ జొప్పాకువలె నొకదెసకుఁ గొట్టుకొనిపోవుచుఁ జేతికిందొరికిన వృక్ష