పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/158

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయమల్లునికథ.

145

గీ. వారిరాక రాక వారిరాశియుఁబోలెఁ
    బొంగు చనుజు లెదురు పోవుటయును
    ఆదరించి ప్రేమ నాలింగితులఁ జేసి
    సేమమడిగి ప్రీతిజెందిరపుడు.

రతిమంజరియుఁ బ్రభావతీయు నంతకుఁ బూర్వమే యన్నగరంబుఁ జేరియుండిరప్పుడు

కం. రాకొమరులు వెస నిజభా
     ర్యాకరములు గొనుచుఁబోయి రహి మకుటమణుల్
     సోకఁగమ్రొక్కిరి పితృపద
     కోకనదంబులకు బంధుకోటుల కాలమిన్.

సౌభాగ్యసుందరియుఁ బ్రహర్షాతిశయంబునఁ గొంతసేపుమేనెఱుంగక యానందాశ్రవులచేఁ బుత్రులశిరంబులు దడుపుచునక్కునంజేర్చికొని మూర్థాఘ్రాణంబు సేయుచుఁ గోడండ్రఁదీవించి తత్తద్వృత్తాంతమంతయువిని వారివారికులశీలనామంబు లడిగిన వీరవర్మనిరూపించి చూపుచు

సీ. అతలాథవతి యపత్యం బీ సరోజాక్షి
              కడుసాధ్వి నీ పెద్దకొడుకు పత్ని
    యిది సుధన్వుని కూర్మి యిల్లాలు కృప వాని
              దాచి కాపాడిన ధన్యురాలు
    జయదేవుపట్టి ముచ్చటఁబట్టి రాగవ
             ర్థనునిఁ జేపట్టిన రమణియదియ
    జనకు తప్పు సడల్ప జయమల్లుఁ గైకొన్న
             దుందుమారుని ముద్దు దుహిత యిదియ.

గీ. పద్మసేనకుఁ చినతల్లి పట్టియీమె
    దివ్యగుణథామ తేజోవతీ సునామ
    నీదు నైదవ పుత్ర పాణినిగ్రహించె
    నమ్మ చూడుము కోడండ్ర నైదుగురను.