పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/149

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

కాశీమజిలీకథలు - పదియవభాగము.

పలుకుచు నొకపుష్పమాలఁ దెచ్చియతని మెడలో వైచినది. అతండు మోహాంధుండై తదనుగుణ్యములగు చర్యల జరుపుచు రాజపుత్రుఁడు వచ్చునేమోయని సంశయించుచుండ గ్రహించి రాజపుత్రిక యాజడుపుడిపియాథార్థమంతయుం దేలిపి యతని క్రీడారసవివశుంగావించి నది

శ్లో॥ సద్భావరాగదీపితమదనాచార్యోపదిష్ట చేష్టానాం
     కఃపరిగణనంకర్తుంరతి చక్రావిష్ట రమణయోశ్శక్తః,

అని యెఱింగించి. . . . . . యిట్లు చెప్పందొడంగెను.

__________

222 వ మజిలీ

జయమల్లుని కథ.

పురుషుఁడు రాగవర్ధనుఁడు వనిత రతిమంజరి వారిద్దరికే వినోదము లెట్లుండునో చెప్పనవసరము లేదు. కొన్ని యహోరాత్రము లొక్క గడియవలె గతించినవి. ఒక్కనాఁడు రతిమంజరి రాగవర్ధనునితోఁ బ్రాణేశ్వరా నాఁడు మీరెందుబోవుచు నీనగరమున కరుదెంచితిరి! నా నిమిత్తమే భగవంతుఁడు మిమ్మిందుఁ దెచ్చెనని తలంచెదను. అని ప్రస్తావముగా నడుగుటయు నతండు గుప్పున దనయన్నలవృత్తాంతమంతయు జ్ఞాపకమువచ్చి గుండెజల్లుమన నౌరా! నేనెంత మోహాంధుండనై తిని? ఆయ్యయో మా తలిదండ్రులకుఁ గ్రొత్త శోకము గలిగించినవాఁడనై తినే తన్వీ నేనిక్కడికివచ్చి యెన్నిదినములైనది? అనియడిగిన మూడుదినములైనదని చెప్పినది చాలుచాలు మూడుదినములా మాసము ఆహా! నెల దినములొక్క గడియవలెదోచినదిగదా చిత్రకూట నగరమునఁజిక్కుపడిన మాయన్నలజాడ దెలిసికొనుటకై పోవుచు దారిదప్పి యీయూరుసేరి యిందు మీవలపులఁ జిక్కుకొని ప్రపంచకము మఱచి పోయితిని. కానిమ్ము నేనిఁకనిందు నిలువరాదు