అతలరాజ్యముకథ.
115
యంబులంబఱపి పరలోకాతిధులంగావించెను. కుంటి గ్రుడ్డి వృద్ధుఁడుం దప్ప బేరుపొందినరక్కసుం డొక్కడును మిగిలియుండలేదు. వజ్రకంఠుడు గూడ వారితో మడియుటందెలిసి రాజపుత్రిక శోకింప వీరవర్మ నర్మాలాపములచే నూఱడించి యందుఁజచ్చినరాక్షసులగాత్రములనెల్లనగ్నిసాత్కృతము గావింపఁజేసి శుభముహూర్తంబున నాపద్మసేనతోఁ గూడ దద్రాజ్యలక్ష్మింబరిగ్రహించి మహా వైభవముతో సింహాసన మెక్కెను. అనియెఱింగించి . . . ఇట్లు చెప్పదొడంగెను.
- _________
220 వ మజిలీ
అతల రాజ్యము
వీరవర్మ యతలరాజ్యమునకుఁ బట్టభద్రుండైనతోడనే యాపట్టణమంతయుఁదిరిగి యందలి యంత్రరహస్యములన్నియుం దెలిసికొనియెను. అందుఁబేరుపొందిన రక్కసులెవ్వరునులేరు. ఉన్న వారతనిభుజబలమునకు మించినవారుకారు. కావునఁ బట్టణవాసులెల్ల నతనికి దాసులై యతనిపరాక్రమగ్గించి కొలుచుచుండిరి. అన్నగరము దిక్పాలుర నగరములకన్న నెక్కువశోభగలిగి విశాలమై ప్రకాశించుచున్నది. అతండు దినమునకొక్క వీధివడువునఁ దిరుగుచు నందలివి శేషములఁ దెలిసికొనుచుండెను.
మఱియు భూవివరాంతమునందలి యంత్రశిలాఫలకముకడకరిగి యందుఁగావున్న లంబోదరీకుంభులవలనఁ దనతమ్ముఁడు సుధన్వుని వార్త కొంతవిని వారపకారము చేయఁదలంచినను నప్పుడు చంపక పోవుట యుపకారముచేసినట్లే తలంచుచు వాండ్రకుఁ గానుకలిప్పించి యందు దప్పించి మఱియొక చోటికనిపెను.
అందుఁబడినవారు మడియకుండ మెత్తనిపానుపులఁ బఱపించి