88
కాశీమజిలీకథలు - పదియవభాగము.
రముతో నాలోచింపుచుండఁ బద్మసేన ఆర్యా! మీచరిత్రమువిని మీరు భయపడుచున్నట్లు తోచుచున్నది. మిమ్మునాహృదయంబునం బెట్టుకొని కాపాడెదను నేను మీదాసురాలనై యుండఁ గొదవయేమి? యదేచ్ఛముగా సుఖింపుఁడని పలికిన నవ్వుచు వీరవర్మ యిట్లనియె.
ప్రేయసీ! నీయాదరణణోక్తులవలన నాకెంతేని సంతోషము విశ్వాసముకలిగినది. ప్రాణదాయినివైన నీచెప్పినట్లు నడుచుటకంటె నాకు వేరొకమంచిమార్గములేదు. నేనిందలిరాక్షసులకువెరచి చింతింప లేదు. నన్నుఁబోలే నాతమ్మునిఁగూడ వాఁడు సొరంగములోఁ బడఁజేయును నేను మీమూలమున బ్రతికితినికాని వానింజంపక విడుతురా? అనిపరితపించుచుంటి ననవుఁడాజవరాలు “ఆయువుమర్మములఁగాపాడు"నని యున్నదిగదా. దైవవశంబున నతండు సొరంగమునఁ బడుట తటస్థించినప్పుడాయనమాత్రము వేరొకరీతి బ్రతుకరాదా? లోకములన్నియు దైవాయత్తములుకావా! అవృత్తాంతముదెలిసికొనియెద మీరు విచారింపవలదని ధైర్యముగఱపినది. అతండామెచేయు సుపచారములచే నానందించుచుఁ గొన్ని నెలలు సుఖముగా వెళ్లించెను.
అని యెఱింగించువఱకుఁ గాలాతీతమైనది. అయ్యవారు తదనంతరోదంతమం బవ్వలి మజలీయం దిట్లు చెప్పఁదొడంగెను.
- __________
218 వ మజిలీ
సుధన్వునికధ
లంబోదరి - ఏమిరాకుంభా! యింతయాలస్యమైనదేమి? ఆ కళేబరము నరాంతకుని కప్పగించితివా? ఏమనిరి! ముహూర్తము మారినదఁటకాదా!
కుంభుఁడు - అమ్మయ్యో! నేఁడెంతగండము ఎంతగండము,