ఈ పుట ఆమోదించబడ్డది

తొలిపలుకు


"కళావ్రీణ" "కళాప్రపూర్ణ", పద్మశ్రీ డా

తొలి ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీని మూడు అకాడమిలుగా విభజించటంతో ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమి 1981 ఫిబ్రవరి 1 వ తేదీన ఏర్పాటు చేయబడింది. ఈ అకాడామి మొదటి గౌరవ అధ్యక్షులుగా ప్రభుత్వం నన్ను నియమించి సంగీతలోకానికి సేవచేసే భాగ్యాన్ని కలిగించింది.

సంగీతంలో ఉత్సవాలు నిర్వహించటం, ఆ కళ ప్రోత్సాహానికి సంబంధించిన శిక్షణాలయాలకు, సాంస్కృతిక సంస్థలకు, నిస్సహాయస్థితిలో గల వృద్ధకళాకారులకు ఆర్థిక సహాయం చేయటం, యువ విద్వాంసులకు ప్రోత్సాహక పథకాలను అమలౌ జరపటం, మరుగున పడిపోతున్న మన జానపద సంగీత రూపాల పునర్వికాసానికి కృషి చేయటం మున్నగు కార్యక్రమాలతోపాటు సంగీత రంగంలో పరిశోధన చేయించి గ్రంథాలు ప్రచురించే కార్యక్రమాన్ని కూడా ఆంధ్రప్రదెశ్ సంగీత అకాడమి చేపట్టింది. ఈ ప్రచురణల పథకం క్రింద ఇంతవరకు ఆచార్య శ్రీ చొక్కా శ్రీరామమూర్తిగారు రచించిన "అష్టోత్తర శీతరాగాంగాది వర్ణమాల" ప్రచురించటం జరిగింది.

ఇప్పుడు శ్రీమతి ఎ. అనసూయదేవిగారిచే సేకరింపబడి స్వరపర్చ