అడివి బాపిరాజు జీవిత సువర్ణ రేఖలు
అక్టోబరు 8, 1895 : జననం (భీమవరం, ప.గో. జిల్లా)
1903 : ప్రాథమిక విద్య, కొవ్వూరు
జూన్ 5, 1915 : వివాహం, కూల్డ్రేగారి శిష్యత్వం ప్రారంభం
1917 : ఇంటర్
1920 : బి.ఎ., జాతీయ కాంగ్రెస్లో సభ్యత్వం
1921 : (సహాయ నిరాకరణోద్యమంలో) అరెస్టు, పుత్ర వియోగం.
1922 : సత్యాగ్రహం, అరెస్టు
1923 : చిత్రకళా విద్యార్థిగా ఆంధ్ర జాతీయ కళాశాలలో ప్రమోదకుమార ఛటోపాధ్యాయ శిష్యత్వం
1924 : “గయా కాంగ్రెస్”లో పాల్గొన్నారు
1931 : బి.ఎల్
1934 : ఆంధ్ర విశ్వకళాపరిషత్ నిర్వహించిన నవలా పోటీలో ‘నారాయణరావు’ నవలకు శ్రీ విశ్వనాథవారి “వేయి పడగలు”తో పాటు ప్రథమ బహుమతి
1935 : బందరు జాతీయ కళాశాల ప్రిన్సిపాల్ పదవి
1936 : భార్య సుభద్రమ్మ గారికి అనారోగ్యం ప్రథమ పుత్రిక రాధా వసంత గారికి పోలియో
1949 : కుమార్తెలు రాధా వసంత, ప్రేమకుమారి గార్ల వివాహం.
1950 : కనకాభిషేకం; మద్రాసు తెలుగు భాషా సమితి ఆధ్వర్యాన తయారైన తెలుగు విజ్ఞాన సర్వస్వానికి, సాహిత్యం, భాష, కళలు, విద్య మొదలైన విషయాలకు సంబంధించిన సంపుటం తయారు చేసే ఉపసంఘంలో సభ్యత్వం.
1951 : సింహళంలోని సిగిరియా గుహల్లో గల కుడ్య చిత్రాల ప్రతిరూపాల చిత్రణకై పరిశీలన యాత్ర.
సెప్టెంబరు 22, 1952 : మరణం.
జననం:8-10-1895::మరణం:22-9-1952