ఈ పుట ఆమోదించబడ్డది
హరిశ్చంద్రోపాఖ్యానము
ద్విపద
ద్వితీయభాగము
మనుజేశు డంత నమ్మగువ నీక్షించి
'మనకు నేఁ డిచ్చోట మసలుట దగదు
ముందఱ నున్నది ముయ్యేఱునేల[1]
యం దున్నజనులు మహాజను[2]' లనిన
వనిత యిట్లనుఁ బ్రాణవల్లభుఁ జూచి
“పెను పొందుతత్పురిపే రేమి దేవ
యొనరంగ నే[3]లెడియొడయుఁ[4] డెవ్వాఁడు
మన కెవ్వ రందు సంబంధబాంధవులు
మనయప్పు తెగటార్ప మది వేఁడువారి
వినిపింపు వారల విమలాత్మ' యనినఁ10
జందనగంధి కాజననాథుఁ డనియె
'నిందుకళాధరుం డే[5]లు నప్పురము
నావిశ్వనాథుఁడే యాత్మబాంధవుఁడు
దైవంబుఁ ద్రాత[6]యు దాతయు మనకు