పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.1 (1918).pdf/15

ఈ పుటను అచ్చుదిద్దలేదు

- విజయదశమి `విత్రుఁడగుచున్నాఁడు. శుష్క వ్రతుఁడైన అర్జు నుఁడు రసలాలసతచే నార్ద్రుఁడగుచున్నాఁడు. " వలన నే కవి, 'శోభనముమీదను శోభనమౌచు నింపుగ౯ ' అని విజయవిలాసమును బూర్ణముఁజేసెను. మూడవదశ అజ్ఞాత వాసము. ఇందు గమనింపదగినది అస్త్రవియోగము. ఈసంవిధానము ముఖ్యముగా అర్జు నుని చిత్తసంయమనమునకు స్ఫుటసూచనగాఁ దీసికొన "వచ్చును. గాండీవివంటి ధన్వికి చిత్తసంయమనము లేనిచో నిరంకుశమైన ప్రయోగోపసంహారములు లోకనిగ్రహము లే పరిణమించి యుండును గాని లోకానుగ్రహకారక ములై శాంతించి యుండవు. భారతరణము లోకశాంతి స్థాపనకై సంకల్పింపఁబడినది. ఇది నిర్వివాదము కాక పోయినను సంప్రదాయవాదు లిచ్చిన యర్థము మాత్ర మి దియే కదా ? విజయుఁడీ మహాకథకు నాయకుఁడగుట చేత నే సంకల్పసాధనలు రెండును ఇతనియందు యధా పరిమితములై శక్తిమంతములయినవి. తృతీ యవ్యవస్థ కురు క్షేత్రరణరంగమందు ఆరంభించు చున్నది. ఇందు ఒకానొక ఉదారనాయకుని జిజ్ఞాస కాండ చక్కగా విశదీకరింపఁబడినది. అర్జునవిషాదయో గము మహాభారతక థాకంఠమునందు పసుపు త్రాడులాగు వ్రేలాడుచున్నది. అది మాంగల్యమో ఉరితాడో- నచ్చఁ జిత్రింపవలసిన భారము కవిది. . “ఉ. తాతల మామల సుతులఁ దండ్రులఁ దమ్ముల నన్నల గురు వ్రాతము శిష్టకోటి సఖి వర్గము: దుచ్ఛజనానురూప దు ర్నీ తివధించి యేఁబడయి నెత్తుటఁదోగిన రాజ్యభోగముల్ ప్రీతియొనర్చు నే? యశము 3 పెల్లాడఁ గూర్చునె పెంపొవచ్చు నే. అని అర్జునుఁడు ప్రకంపవాచియై తహతహలా డెను. గాండీవము హస్తమునుండి క్రిందకు జాతిపడెను. దాని శ్రీకృష్ణుఁడు పన్నిన మహాభారత సంగ్రామత్రంతమం తయు ఇసుకయిల్లు కూలినట్లు కూలెను. ఇంక గతియేమి. కృష్ణుడేగతి. ఉభయపక్షవీగులురు ప్రత్యక్షముగనో పరోక్షముగనో సంగ్రామ సంప్రాప్తికై పనిచేసిరి. ' అం దు శ్రీకృష్ణుఁడు ప్రముఖుఁడు. వీరులు యుద్ధము నే కాం క్షించిరి. కాంక్షితమె నెట్టికొనివచ్చినది. అస్త్రము లా హూరములైనవి. శస్త్రములు సానలపై మెఱుఁగెక్కి నవి. రణజ్వరము వ్యాపించినది. రక్తదాహము తీండ్రించి నది. అక్షౌహిణులు వ్యూహముఖముల నడ్డినిలచినవి. ప విత్రమగు కురుక్షేత్రమున నింక నిముసములలో నెత్తు పే ళ్లు పాఱనున్నవి. అది కడు సంక్షో భాసమయము. కర్మ కాండ జరుగవలసినది జ్ఞానకాండ సందుకొనినది . అపు డేమి చేయవలెను? ఉఛయపంక్తులకును సామరస్యము m ను గొలిపి, అర్జునవిషాదమును తప్పింపవలెనా? లేక ఎ త్తినియెత్తు న్యాయసిద్ధమయిన ముగింపునకుఁ దేవలెనా? శ్రీకృష్ణుఁడు రెండవమార్గమున నడచెను. యోధవర్గ మును నడిపించెను. గీతోపదేశ మొనర్చి నిష్కా నుకర్మయోగము 1 నుద్ధరించెను. ధర్మవశుఁ డైనఅష్టపదకు స్వజనచ్ఛేదము నా ప్తవిధిగా సంగీకరించి కృతకృత్యుఁడయ్యెను; విజయుడ య్యెను. వీరారాధనయోగ్యముగు మహాభారతమునకుఁగ్ర మాగనుతయిన ఉపసంహారమును గల్పించెను. ఇందుఁగల యర్థస్ఫోట మేళన మహాసంగ్రామమునకుఁ బ్రధాననా యకుఁడయిన అర్జునుఁడు స్వార్థనికతుఁడా-లేక స్వార్థని స్పృహుఁడా యను వంశము తేలుటయే. దేవదత్తము కురు క్షేత్రమందు మ్రోగువఱకును అర్జునుని మనస్సు వి స్ఫుటముగాఁ గానరాలేదు. పరాజితులయిన పౌరుష వంతులకుండు మాత్సర్యస్పర్థలు మాత్రమె కానవచ్చినవి. ఇపుడన్ననో అవి యన్నియును మాఱినవి. అర్జునుఁడు కేవలము పగసాధించుటకై గాండీవమునుటంకరించెనా? లేక నిరంకుశ రణదాహము నాపలేక నెత్తురుకూడుఁ గాంక్షించెనా? లేక రాజ్యలుబ్ధుఁడై తెగించెనా? ఈ సమస్యలు — సమస్యలన నేల సందేహములు - విచ్చిపో వుటకే అర్జునవిషాద యోగము వచ్చినది. ఒక మహాయో ధకుమారుని అనుకంపాకారుణ్యాది స్నిగ్ధగుణములను బైకిదెచ్చి చూపినది. అసూయాక్రోధావి క్షుద్రగుణ కాలుష్యమును క్షాళితముఁ జేసినది. తుదకు ఉదాత్తమ గు నిష్కామకర్మయోగమును స్థాపించినది. కథానాయ కుఁడగు అర్జునుఁడు స్వధర్మబద్ధుఁడై సంకల్ప సన్యాస -