పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/20

ఈ పుటను అచ్చుదిద్దలేదు

. 90 96 గ్రంథాలయ సర్వస్వము.

బుషులు సయితము సుజ్ఞానులయి ప్రపంచమున ప్రసి చెందిన నాగరికులయి, అంతములేని ఐహికాముష్మిక జ్ఞానసంపత్తిని మనకు పరంపరాభివృద్ధిగా నుండుటకొ సంగి మృతజీవులై, లోకమందెల్లైన మార్గదర్శకులై శా శ్వతానందపదవి నొందగలిగిరని మన గ్రంథము లే, మనక ట్టుబాటులే, వేనోళ్ళ చాటి చెప్పుచున్నవి. కావున మీ రెల్లకు ఈ సంగతిని మనమున పదిలపరచుకొని సాధ్యమై నంతవరకు మీ కాలమును, మీధనమును, ఈ సమాజాభి వృద్ధికి వినియోగించెదరు గాక ”

ఈ సమాజము యొక్క మందిర నిర్మాణమునకు మొత్తము 625 రూపాయిలు వ్యయమయినవి. ఇత్వడీ సమాజము 600 కంటె నెక్కువ ఆంధ్రగ్రంథములతో, విరాజిల్లుచున్నది. పలువిధములగు వార్తాపత్రికలీ సమా జము నలంకరించుచున్నవి. ఈసమాజము శాశ్వత ప్రతిష్టా తనయై వెలయుటకు గాను రు 5000 లు మూలధనమయి న గావలయునని కార్యదక్షులభి ప్రాయపడుచున్నారు. అంధ్రదేశ పితామహుడగు రావుబహద్దరు శ్రీ కందు కూరి వీ రేశలింగము పంతులు గారి పవిత్ర నామముచే ప్ర ఖ్యాతినిగన్న ఈసమాజమున కింతపాటి ద్రవ్యము లభింపకపోదని మాయాళీయము,

చారిత్రిక పరిశోధనము.

[ఆలూరి గురురాజారావు గారిచే వ్రాయబడినది.]

దేశచరిత్రలు వ్రాయుటయందు మనము తగుప్రయత్న ములు సలుపుటలేదు. ఇదివఱకు వ్రాసినవన్ని యును చిన్న చిన్న పొ త్త ములేకా ని సుపూర్ణమైనవిమర్శనముతో వ్రాసిన యు ద్గ్రంధ మొకటియురు గాన రాకున్నది. చరిత్ర ల మానన్యకతను గూర్చియు తన్మూలమున లఓ ఎ. యుపయోగములఁ గూర్చియు విద్యా ధు ణులసమ్ముఖమున వేరుగఁ దెల్పుట యన వసరము. దేశచరిత్ర సంపూర్ణదశలోనికి తే వలయుననిన అందలి భాగముల యొక్క అనఁ గా రాష్ట్రముల యొక్క యు, జిల్లాల యొక్క యు తాలూ కాలయొక్కయు, సంస్థానముల యొక్క యు చరిత్రలు బహువిపులముగ ప్రథమమున వ్రాయవలయును. ఇవ్విధమున సమస్త భాగ ముల చరిత్రలును వ్రాసినచో వీనినుండి సాధ నముల సంగ్రహించి బహుసులభముగ దేశ చరిత్ర వ్రాయవచ్చును. కావున దేశ చరిత్ర లు వ్రాయుటకుఁబూర్వము అందుండెడి భాగముల చరిత్రలు వ్రాయుట మిక్కిలియవసరము.

ఇవ్విధమున వివిధభాగముల చరిత్రలు వే కువేరుగా వ్రాయఁ బూనుకొనునప్పుడు సాధ నములు సేకరించుటకై యసాధారణమయిన ప్ర యత్నము సలుపవలసియుండును. అప్పుడు చరిత్ర కారుఁడు మిగుల ప్రయప్రయాసముల కోర్చి అన్వేషణార్థమై బయలుదేఱురు. అట్టి సందర్భముననే అచ్చటచ్చట మాఱుమూలల నణఁగియుండు అమూల్య సాధనములు బయలు పడుటకు కారణమగును. విజ్ఞాన చంద్రికామం డలివారి ప్రోత్సాహముచే నాంధ్ర దేశ చరిత్ర వ్రాయఁబడుచున్న ది. అందు వివిధ ప్రాంతము ల చరిత్రలును, ఆ భూప్రాంతములందు వేరు వేరుకాలమున నేయే వంశమువారెంత కాలము వఱకు పాలన మొనర్చినదియను, క్లుప్తముగా వ్రాయఁబడుచున్నది. ఇంతటితో మనము తృ ప్తి మెందుటకు వీలు లేదు. ప్రత్యేకముగ పూ