ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్తించెద మని పలికి యతనిచేత ననుజ్ఞాతులై నిజనివాసంబులకుం జనిరి వసిష్ఠాది
మహర్షులు యుక్తప్రకారంబున దశరథునిచేతఁ బూజితులై యాశీర్వదించి య
నుజ్ఞ వడసి తమతమవిడుదులకుం జని రంత నమ్మహీకాంతుండు సచివుల నంద
ఱ నిజనివాసంబులకుం బోవం బనిచి తాను నభ్యంతరమందిరంబునకుం జని
మనోహారిణు లగునిజపత్నులం జూచి యేను సుతార్థంబు హయమేధయాగంబుఁ
జేసెద మీరు దీక్ష వహింపుం డనిన వారు మనోహరం బైనపతివచనంబు విని
హిమాత్యయంబునందలిపద్మంబులుం బోలె ముఖపద్మంబు లత్యంతశాంతి
సౌకుమార్యంబునం దనరఁ బరమానందభరితహృదయ లై యుండి రప్పు
డేకాంతంబున సూతుం డంజలి ఘటించి దశరథున కి ట్లనియె.

235

సుమంత్రుండు దశరథునకు సనత్కుమారోక్తరహస్యముం దెలుపుట

తే.

నరవరోత్తమ తొల్లి సనత్కుమార, మౌనివర్యుండు మునిసభామధ్యమందుఁ
బొసఁగ మీకుఁ గుమారులు పుట్టునట్టి, విధము దెలియంగఁ బలికె సవిస్తరముగ.

236


మ.

అది యేను న్విని యున్నవాఁడఁ దగ నయ్యర్థంబు మీ కర్థిఁ దె
ల్పెద నాలింపుము కాశ్యపాత్మజుఁడు నక్లిష్టస్వభావుండు ని
ర్మదుఁ డార్యుండు విభాండకుం డనఁగ విప్రశ్రేష్ఠుఁ డుద్యద్గుణా
స్పదుఁ డొక్కండు గలండు నిశ్చలతపస్సంపన్నుఁ డమ్మౌనికిన్.

237


చ.

ఘనమతి ఋశ్యశృంగుఁ డనఁగా నొకపుత్రుఁడు గల్గు నాతఁ డా
వనమున నిత్యముం బెరిగి వారక పిత్రనువర్తనంబుచే
ననవరతంబుఁ గాననమునందె చరించుచు నుంటఁ జేసి తా
మనమున నించుకైనఁ బరమర్త్యు నెఱుంగక యుండు నెంతయున్.

238


క.

ధీవరుఁ డగునమ్మౌనికిఁ, బావనలోకప్రసిద్ధపరమర్షికృతం
బై వఱలు బ్రహ్మచర్య, ద్వైవిధ్యము గలుగు నధికతాత్పర్యమునన్.

239


క.

పితృశుశ్రూష యొనర్చుచు, సతతముఁ బావకునిసేవ సలుపుచు యోగా
న్వితుఁ డై యీగతి నిత్య, వ్రతుఁడై మునిసుతుఁడు గాన వర్తించు నెడన్.

240

రోమపాదమహారాజవృత్తాంతము

చ.

అనఘవిచారుఁ డంగవిభుఁ డద్భుతవీర్యుఁడు రోమపాదుఁ డ
త్యనుపమలీల లోకనుతుఁ డై బుధసమ్మతుఁ డై యరాతిసూ
దనుఁ డయి రాజధర్మ మది దప్పక రాజ్యము సేయుచుండుఁ జం
దనశశికుందపాదరసధామవిడంబియశోభిరాముఁ డై.

241


వ.

అమ్మహీపతి విధినిషేధోల్లంఘనంబున.

242


తే.

అఖిలభూతక్షయావహ యై సుఘోర, యై సుదారుణ యై లోక మబ్జదళస
లిలముగతిఁ దల్లడిల ననావృష్టి దోఁచె, నమ్మహీపతి సేయు రాజ్యంబునందు.

243


తే.

అట్టికాలవిపర్యాస మంతఁ జూచి, ధారుణీభర్త శోకసంతప్తుఁ డగుచు