ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మంతుండును నొక్కం డైన లేఁడు బ్రాహ్మణజనంబులు ధర్మాత్ములును ముదితు
లును బహుశ్రుతులును సత్యవాదులును ద్యాగశీలురును గుటుంబవంతులును
గవాశ్వధనధాన్యవంతులును సుసంయుతులును శీలవంతులును వృత్తసంపన్ను
లును మహర్షికల్పులును స్వకర్మనిరతులును విజితేంద్రియులును దానాధ్య
యనశీలురును బ్రతిగృహంబునందు సంయుతులును నై ప్రకాశించుచుండుదు
రు క్షత్రియులును వైశ్యులును జఘన్యజులును నీమూఁడువర్ణంబులవారు కృతజ్ఞు
లై శూరు లై వదాన్యు లై విక్రమసంయుతు లై యలరుచుండుదురు మఱియు
నప్పురంబునం గలసర్వజనంబులు దీర్ఘాయుష్మంతు లై సత్యధర్మరతు లై పుత్ర
పౌత్రసహితు లై కళత్రవంతు లై వఱలుదురు మఱియును.

202


క.

ద్విజుల భజింతురు నృపతులు, ద్విజనృపుల భజింతు రెపుడు వీటికి రాటుల్
ద్విజన్మపవైశ్యుల నిత్యము, భజియింతురు పాదజనులు పరమప్రీతిన్.

203


శా.

హర్యక్షప్రతిమానశౌర్యులు మహాహంకారులుం గాంచనా
హార్యాభస్ఫుటధైర్యు లుగ్రసమరవ్యాపారులున్ విక్రమౌ
చార్యస్ఫీతమతు ల్మహామహులు యోధగ్రామణుల్ నిత్యమున్
హర్యక్షంబులు వోలె ద్రిమ్మరుదు రుద్యత్ప్రీతితో నప్పురిన్.

204


సీ.

రంభ యీడను టెట్లు లలితోరుకాండము ల్పరికించి సిగ్గున శిరము వంప
హరిణి జో డను టెట్లు స్ఫురితేక్షణవిలాస మది కాంచి నంతనె బెదరి పఱచు
నలతిలోత్తమ సాటి యను టెట్లు నాసికాకృతిఁ గనుంగొని తలక్రిందు గాఁగ
శశిరేఖ సరి సేయఁ జను టెట్లు నెన్నొస ల్పసఁ గాంచి కళలకుఁ బాసిపోవ


తే.

హేమ యెన యగు టెట్లు యహీనగాత్ర, కాంతిఁ జూచినమాత్రనె కరఁగిపోవ
నఖిలభువనమనోజ్ఞరూపాఢ్య లగుచుఁ, దనరు నవ్వీటివారకాంతామణులకు.

205


తే.

అలఘుతరతారకాహృద్య మై యమేయ, వసువిశాల మై యుచితధ్వజము నగుచు
రాజమార్గంబుకరణి నారాజధాని, రాజమార్గంబు శోభిల్లు రమ్య మగుచు.

206


తే.

ఎలమి శక్రుండు సురలోక మేలినట్లు, శ్రీదుఁ డల కాపురంబు రక్షించినట్లు
ధరణి రాజోత్తముం డైనదశరథుండు, లీలతో నప్పురంబుఁ బాలించుచుండు.

207


చ.

అలఘుతరప్రతాపమున నారయ శీతలచిత్తవృత్తికిం
వలరఁగ నామసామ్యమున నయ్యినరాజులె సాక్షిగాఁ జతు
ర్జలనిధు లెన్ని చూడ వరుస న్బొలిమేరలుగా సమస్తభూ
తలగురుభారవాహి యయి తద్దయు నొప్పె నతండు ధారుణిన్.

208


వ.

మఱియు నచ్చట నివసించి దశరథుండు జగంబుఁ బరిపాలించుచుండు నట్టియో
జనత్రయవిస్తారం బైనసాకేతపురమధ్యంబునందు యోజనద్వయమాత్ర
ప్రదేశంబున కయోధ్య యనెడునామంబు సత్యనామం బై యుండు నట్టిమహా
రాజధానిఁ బరిపాలించుచు నమ్మహారాజశేఖరుండు సర్వవిదుండును సర్వసంగ్ర