ఈ పుటను అచ్చుదిద్దలేదు
పూజితారావమానాలూ, తమనక్షత్రానికి చెప్పబడ్డ సున్నలూను. ఈ సున్నాల్ని బట్టేవారి ఆరోగ్యస్థిగతుల మదింపు జరుగుతుంది. దీనినే "కందాయ ఫలమ్" అంటారు. ప్రతితారకూ వానిస్థితినిబట్టి సున్ననుండి ఏడుసంఖ్యలవరకూగల అంకెలలో ఎవో మూడు అంకెలు వరుసగా వ్రాయబడతాయి ఫలితాలు ఈ సున్నల స్థానానిబట్టి చెబుతారు.
"ఆదిశూన్యే మహావాధి,
మధ్యశూన్యే మనోవ్యధా
అంత్యశూన్యే ఫలం స్వల్పం
త్రిశూన్యే నిష్పలం భవేత్"
అవన్నీ తెలుసుకుని పురోహితునికి సంభావనలిచ్చి సత్కరిస్తారు.
య మ ద్వి తీ య
ఇక విదియదగ్గరకొస్తే కార్తీకశుద్ధవిదియను యమద్వితీయ అంటారు. ఈరోజుబ్రాహ్మణ కుటుంబాలలో కొందరుభక్తితో యమునిపూజించి భగెనీహస్తభోజనం చేస్తారు (సోదరి చేత్ భోజనం) దీర్ఘాయువుకోసం. ఈరోజు శ్రీకృష్ణుడు సుభద్ర చేతిభోజనం చేశాడట.
అ ట్ల త ద్ది
తదియకు ప్రాముఖ్యం సంవత్సరంలో రెండుసార్లు వస్తుంది. మొదటిదై ఉండ్రాళ్ళతద్ది. భాద్రపద బహుళ తదియ ఉండ్రాళ్ళతద్ది. రెండవది అట్లతద్ది. ఆశ్వయుజ బహుల తదియ అట్లతద్ది. ఇందులో అట్లతద్దిది అగ్రస్థానం. ఈ రోజున వేకువఝామునే పిల్లలులేచి జట్టులు జట్టులుగాకూడి "అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్" అంటూ అరుస్తూ వీధులంట తిరుగుతూ ఊరందర్నీ మేలుకొలుపుతారు. ఇది పూర్తిగా స్త్రీలకు సంబంధించినది. ఈ తద్దెలౌపవాసం బలేతమాషాగాఉంటుంది. స్త్రీలు కోడికూతతోలేచి వంటలుచేసికొని తెల్లవారకుండా భోజనంచేసేస్తారు. మళ్ళీ రాత్రి చంద్రునిచూసినతరువాతే భోజనం. అంటే పగలంతా పచ్చిమంచినీళ్ళుకూడా ముట్టరన్నమాట, ఏమీతినరు. తింటే ముసలిమొగుడొస్తాడట. దీనికొక కధకూడా చెబుతారు ముసలమ్మలు. ఒకప్పుడు బాపరారక్కమ్మ, రాచనారక్కమ్మ,