ఈ పుట ఆమోదించబడ్డది

2

ఇ చ్చి నీ కు మా రి

యాకసము గంగాయమునానదులుగూడిన ప్రదేశమువలే మనోహరముగా నుండెను.

ఇట్టిసమయమున ఘూర్జరదేశమున కీశాన్యదిక్కుగా నున్న మహాటవియం దిరువురుపురుషులు సంచరించుచుండిరి. వారు నఖశిఖపర్యంతమును వ్యాపించిన కవచమును దొడిగికొనిరి. కావున నారి దేహచ్ఛాయ లెట్టివియో మనము చెప్పలేము. వారు మిక్కిలి యున్నతశరీరులు. మోపెట్టిన దృఢచాపములు వారికరములం దుండెను. వాఁడిబాణములు వారిరెండవచేత వెలయుచుండెను. సమున్నతములగు నీటెలను, నతిదీర్ఘము లగు ఖడ్గములను, మఱికొన్ని మృగయాసాధనములను దాల్చి వారు చూపఱకు భీతి గొల్పుచుండిరి. ఎత్తగు చెట్లకొమ్మలందుఁ దగినతావు లేర్పఱుచుకొని మృగములనిమిత్త మొకనదీతీరమున వారు గాచుకొని యుండిరి. చాపహస్తులగు నావీరులను జూచినప్పుడు సురపొన్నతరువునందుఁ బొంచియుండి సమాధినవలంబించి యున్నశంకరుని వేఁటాడనుంకించుచున్న మన్మథుఁడు మనకు స్ఫురింపకపోఁడు. కాని, యతనిబలె వీ రపాయములపాలఁ బడలేదు. అతని బాణములవలె వీరిబాణములు , వ్యర్థములుఁ గాలేదు. చక్కఁగా గుఱిచూచి ప్రయోగించిన వారి బాణము లిదివఱ కొక్కొక్కటి యొక్కొక మృగమును గూల్పఁగలిగినవి. అందుచే వారు మన్మథునివలె వ్యర్థమనోరథులు కాలేదు. అయినను వారి కొకవిచారము లేకపోలేదు.