ప్రక ర ణ ము 7
35
ఆ రాయబారియు జైతునకు వినయపూర్వకముగా
సమస్కరించి తదనుమతిని బడసి యుచితాసనమునఁ గూర్చుం
డెను. పరమారుఁ డతనిఁ జూచి 'భీమ దేవుఁడు నాకు రాయ
బార మంపియున్నాఁడా ? ఇది మిక్కిలి వింతగా నున్నది.
మాకును, నతనికిని వ్యవహారము లేమియును లేవే! ఏదీ !
వినిపింపుమా, నీవృత్తాంతము' అని పల్కఁగా నాతఁడు లేచి
నిలువఁబడి రాజేంద్రా ! నేను భీమ దేవుని స్నేహితుఁడను,
న న్నమర సింహుఁడందురు. మారాజుననుమతి ననుసరించి
తమ్ము దర్శింపనచ్చితిని. మారాజేంద్రుఁడు తమసన్నిధిని
బల్కవలయునని చెప్పిన మాటలు యథాను పూర్విగా
పించుచున్నాను. దేవరవారవధరింపుఁడు, “ఓరాజేంద్రా !
పరమారునంశజులు రాజపుత్రులలో సుప్రసిద్ధులు. మీ వంశ్యు
లందతిలోను నీవు చుక్కలలో జంద్రునివలెఁ బకాశించు
చున్నావు. జాతి చేతను, నీతి చేతను, విఖ్యాతి చేతను నీ వీ కాల
మున వాసిగాంచినావు.” అని చెప్పుచుండ నతని కడ్డువచ్చి
పరమారుఁ డిట్లనియె.
'ఓయీ ! ఇవి భీమదేవుఁడు పల్కిననచనము లే !' యడిగెను.
అమ: దేవా ! 'అవును, అతనినోటనుండి నచ్చిన మాటలే తు, చ తప్పకుండఁ జెప్పుచున్నాను' అని చెప్పెను.
జైతుండాశ్చర్యమును సూచించుచు 'ఆఁ, ఏమి ! భీమ దేవునోటనుండి వచ్చినమాట లేయివి ! ఆశ్చర్యమాశ్చ