ప్రకరణ ము 27
159
భీ: నిన్న సం దేశహరుఁడు గాక మఱియెవ్వ రైన మనదుర్గములోనికి నచ్చిరా ?
భ" లేదు, మహాప్రభూ !
భీ: నిజము చెప్పుఁడు. లేనిచో మీతలల నజకిం చెదను.
భ: -మహా రాజా ! నిన్న సం దేశహరుఁడు తప్ప మ రెవ్వరును రాలేదు. తమ సెలవు లేని దే మే మెవ్వరిని విడువలేదు. లోనికిరానీయ లేదు. నిన్న రాత్రి నాల్గవ వానిని లోనికి బోనీయ మని మే మెంతో నిర్బంధించితిమి. "కాని,సం దేశహరుఁడు 'భూయాదుననుచరుని విడువక పోయినమాప్రభువుగా రిందుల కంగీకరించినా ' రని చెప్ప నూరకుం టీమి. ఆ పురుషులు మున్వురును ముందుగాఁ బోయిరి. తరువాత రూపవతి వచ్చి ద్వారము దాఁటిపోయినది, అంతకుఁ దప్ప మా కేమియును దెలియదు.
భీ: - యువతీ ! నాల్గవ వాడు వచ్చినట్లు నీ వెఱుఁగుదువా
రూ: మహారాజా ! నాకుఁ దెలియదు. నాతోరాలేదు. వచ్చుచున్నాఁడని కూడ నెఱుఁగను.
భీ: నీవు పోల్చుకో లేక పోతివి. కాని, మార్గమధ్యమున మిమ్ముఁగలసికొ నెనని చెప్పితి వే ? ఆతఁడు భూయాదుని ననుచరుఁ డే కావచ్చును !
రూ: వా రిరువురును సత్యముగా భూయాదుఁడు, నతనియనుచరుఁడును నైనచో నన్ను శత్రువులనుండి రక్షిం