ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

35

విని గోవరమణులు వెఱఁగంది యతనిఁ
గనుఁగొని పలికి రుద్ధతబాష్పు లగుచు,

విరహార్తలగు గోపభామినులు ఉద్ధవునిఁ జూచి పలుకుట


“హరి నిన్నుఁ బుత్తేర నరుదెంచి యంత
వరయశోదకును నవ్వార్తలుఁ జెప్పి
యూరకె పోవేల? ఒగి మమ్ముఁ జూచి
చేరి స్వామిహితంబుఁ జెప్పెదుగాక!
ఇట నింక నెనరువా రెవ్వరు గలరు?
కటకటా! మమ్మేల కమలాక్షుఁ డడుగు?
అడిగెడివాఁడైన నరుదేఁడె యిట్లు
విడుచునే మమ్ము నీవిరహాగ్నినడుమ?"
అని పల్కి కృష్ణుని యంగంబుసొబగుఁ
కనుబారులీలలు, తనువు చిత్తమునఁ
గ్రొత్తైన విరహాగ్ని గురుసులు వార
నత్తలోదరులు సిగ్గరి యాడిపాడి
యొకయింతి కుసుమగుచ్ఛోద్ధూతమధువుఁ
బ్రకటితంబుగఁ గ్రోలి పాడుచునున్న
మధుపంబుఁ జూపి నెమ్మది మాటువెట్టి
మధురగర్వోక్తి నున్మాదియై పలికె.380

గోపికల విరహము


“చంచరీకమ! నీవు చంచలాత్ముఁడవు
వంచకుండవు పుష్పవతులఁ గీలింతు
నిలిచినకాలున నిలువ వేప్రొద్దు