ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

ద్విపదభాగవతము

జనుదెంచి శీతలజలమాని తీర
మునఁ దరుచ్ఛాయ నిమ్ముల విశ్రమింప

కాళిందీపరిణయము


రక్తాబ్జపదతలరాజీవ వదన
మౌక్తిక మణిదంత ఘనమాననయన
పులిననితంబ కంబుపమానకంఠ
యావర్తనాభ రథాంగ వక్షోజ
శైవాలరోమసంచయ బిసపాణి
యననొప్పు కాళిందియను వరారోహ
చనుదెంచి కృష్ణుని సన్నిధి నిలువ;
వనిత సౌభాగ్య లావణ్య చాతుర్య
మనిమిషనేత్రుఁడై హరి చూచెనంత,500
నరుఁడింతిఁ గనుఁగొని “నలినాక్షి! ఏఁటి
కరుదెంచితీ వెవ్వె”రని పల్కుటయును,
మురిపెంపు సిగ్గును మోమున బెరయఁ
దరలాక్షరోచులు దనర నిట్లనియె.
“కాలాత్ముఁడగు సూర్య కన్యక నేను
కాళింది యనుదానఁగమలాక్షుఁగూర్చి
తపమాచరింతు నీ తటమున, వేఁట
నెపముననేతెంచు నీరజోదరుని
కామించి వచ్చిన కార్యమం”చనిన;
ఆమెను మన్నించి హరి తోడుకొనుచు
కరిపురి కేతెంచి కాళింది కన్యఁ
బరిణియంబై యొప్పెఁ బద్మలోచనుఁడు.