ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

ద్విపదభాగవతము

చెల్లునే పాపంబు సేయంగ నీకు?
ఎక్కడ వినఁజూడ మిట్టి దుర్నీతి
నెక్కడగలిగె! నీ వెవ్వతవ”నుండు;
హరికి రుక్మిణికిని యవతరించుటయు
నెఱిఁగి శంబరుఁడు తానిందుఁ దెచ్చుటయు
జేరిన చందంబుఁ జెప్పె, వెండియును
నారామ భావజు నల్లన పలికె.
“రతి నేను నా పుష్పరతుఁడవు నీవు
ప్రతిలేని యాదిదంపతులము గాన
వీండొక గతిగాదు వీని నిర్జించి
దండిమై మనము వోదము ద్వారవతికి.
ఇతఁడు మాయావిధం బెఱుఁగు నీతనికి
బ్రతిలేని విద్య లభ్యాసంబు సేయు;”300
మనుచు మాయావతి యమ్మహావిద్య
మనసిజునకు నిచ్చె మంత్రయుక్తముగ
ప్రద్యుమ్నుఁ డంత నాపడఁతిచేఁ బెక్కు
విద్యలు నేర్చి యా వెలఁదియుఁ దాను
ధ్రుతిఁబూని వర్తింపఁ దెలిసి శంబరుఁడు

శంబరప్రద్యుమ్నుల యుద్ధము


నతి వేగమునను మహాగ్రహం బొదవ
మదనునిఁ దెగటార్ప మది విచారించి
గదఁగొని లయకాలకాలుఁడో యనఁగఁ
బఱతెంచి వైచిన భావజుం డలిగి
యుఱక యాతనివక్ష మురుముష్టిఁ బొడిచె;