ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

ద్విపదభాగవతము

యతులితంబగు వరమడ్గవే యనిన
నారాజు పెక్కండ్రు యసురులతోడఁ
బోరాడి తనియకవో నిద్రఁ బోవ
“వరమిండు నన్ను నెవ్వఁడు మేలుకొలుపుఁ
బొరివాఁడు భస్మమైపోయెడు” ననుచు
దివిజుల వీడ్కొని ధృతి నొక్కశైల
వివరంబు సొచ్చి యవ్విధి నిద్రవొంద
హరిమాయఁ బడెఁ గాలయవనుఁ డీరీతి.

ముచికుందుఁడు శ్రీకృష్ణునిఁ గాంచుట


ధరణీశవర్యుఁ డంతట లేచి వచ్చి
జలజాక్షు దేహతేజస్ఫూర్తి బిలము
వెలుగొంది చీకటి విఱియుటఁ జూచె.
ఆయతాంబునేత్రు నతిదీర్ఘబాహు
తోయదనీలాంగు తుహినాంశువదను630
గనకపీతాంబరుఁ గౌస్తుభోద్భాసి
వనమాలితోరస్కు వారిజనాభు
మకరకుండలదివ్యమకుటకేయూరు
వికసితాలంకారు విష్ణునిఁ గాంచి
వెఱఁగంది యందంద వెఱచి గోవిందు
నెఱుఁగక ముచికుందుఁ డిట్లని పలికె.
“హరివహ్నిశశిభానులం దొక్కదివ్య
పురుషుఁడవో! కాక భువి నిట్టితేజ
మెవ్వరికున్న దిం దేల విచ్చేసి
తెవ్వరు నీనామ మెఱిఁగింపు” మనిన,