పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/91

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనుర్విద్యావిలాసము

27


కృపుఁడు భీష్ముఁ డాచార్యు నగ్గించి విద్య
గఱపనునిచిరి పాండవకౌరవులకు.

102


ఉ.

పాండవకౌరవుల్ పరమపావనుఁడౌ గురు నాశ్రయించి కో
దండకళానుభూతి సతతంబు పరిశ్రమ మాచరింపఁగాఁ
బాండవమధ్యముండు గురుభావము రంజిల భక్తియుక్తుఁడై
నిండుఁదనంబునం గొలిచి నేర్చుచునుండు ధనుఃప్రయాసముల్.

103


వ.

అంత నొక్కనాఁ డాచార్యుండు విలువిద్యగఱచు రాజకుమారలో
కంబు నాలోకించి నామనోరథంబు సఫలంబు గావించువాఁడెవ్వం
డనవుడు, తక్కుంగల రాజకుమారు లొండొరులమొగంబులు సూ
చుచు నెద్దియుం బలుకకుండినం బార్థుండు యుష్మన్మనోరథంబు
సఫలంబు గావించెదనని పలుకుటయు, నతని ధైర్యస్థైర్యంబులకు మెచ్చి
యొక్కనాఁ డేకాంతంబున నతనికి ధనుశ్శాస్త్రంబు సవిమర్శకంబుగా
నుపదేశించువాఁడై తనకుఁ బ్రణామం బాచరించి సావధాన మన
స్కుండై విన నుద్యోగించు పార్థునితో వివరించినట్లు రౌమహర్ష ణి శౌన
కాదులకుం జెప్పెనని వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.

104


సీ.

ఈమహావిద్యాలలామంబుగల యిల్లు
        పాలేటిరాచూలి పట్టుఁగొమ్మ,
యీశరాభ్యాససంహిత గాంచు మేటికి
        శాకినీఢాకినీలోక మొదుఁగు,
నీధనుష్పాండితీబోధంబు గలధీరుఁ
        డతులసామ్రాజ్యంబు లనుభవించు,
నీకళాపరిణతి కిరవైన ధారుణీ
        భాగంబు లోకైకపావనంబు,


తే.

ఇది మహానటనానట మిది గభీర
మిది కుమార[1](సమీరి)త మిది యుదార
మిది పరశురామకామిత మిది యపార
మిది సకలధారుణీశ్వరాభీష్టదంబు.

105
  1. తమిది