పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/152

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

నారాచనిర్మాణము


క.

సమ మూర్థ్వలక్ష్యగంబై
తుములంబున మండలం బధోలక్ష్యగమై
యమరఁగ నవసర మెయ్యది
విమలాత్మా, తెలియఁబల్కవే వినవలతున్.

157


వ.

అనిన నాచార్యుండు పార్థున కిట్లనియె.

158


సీ.

హరిదంతదంతావళావళుల్ సరివచ్చు
        మదకలస్తంబేరమములమీఁదఁ
గనకాద్రిశిఖరసంకాశంబులగు మణి
        ఖచితకాంచనశతాంగములమీఁదఁ
జక్రవాళంబు మెచ్చని హేమవరణంపు
        ఘనగోపురాట్టాలకములమీఁద
జలధరంబులభాతి సకలదిక్కులఁ గామ
        గంబైన వరపుష్పకంబుమీఁద,


తే.

నిలిచి క్రిందికి శరములు నిలుపునపుడు
మండలస్థానకంబున నుండవలయు
నున్నతస్థాయిపై శరం బొలయఁజేయఁ
దరియఁ జనువేళ నగు సమస్థానకంబు.

159


వ.

వెండియు వాహనారూఢుం గదిసి శరంబులు నినుచు పాదచారికి
సమస్థానకంబును, నట్లు కదియంబడి శరంబులు నినుచు పాదచారిపై
శరంబులు నడుపు వాహనారూఢునకు మండలస్థానకంబును దక్కుం
గల సమలక్ష్యంబుల నాలీఢప్రత్యాలీఢవైశాఖంబును బ్రతినియతం
బులై యుండు నిట్టి విన్నాణంబు లెఱింగిన ధనుర్ధరుండు త్రిలోకీతిల
కుండగు. నింక ధనుర్ధరాకర్షణహస్తవిశేషంబులును, దదనుకూలం
బులగు విన్నాణంబులు నుపన్యసించెద నాకర్ణింపుము.

160


సీ.

కర్తరీహంసముఖంబు లరాళంబు
        కటకాముఖం బన గణుతిఁ గాంచు,
హస్తముల్ బాణాననాకర్షణంబున
        కలరు నిన్నాలుగు నరయ నందుఁ