ఈ పుట అచ్చుదిద్దబడ్డది

356

మైసూరు రాజ్యము.


కృష్ణ రాజ ఒడయరు

శేషాద్రి అయ్యర్' దివానుగ నుండఁగ నె 1894వ సంవ త్సరాంతమున శ్యామరాజేంద్రుఁడు వైకుంఠ వాసి యయ్యెను. అప్పటికి అతని కుమారుఁడగు ప్రస్తుతపు మహారాజు కృష్ణ రాజు ఒడయరు పదిసంవత్సరముల బాలుఁడుగ నున్నందున వీగితల్లి పరిపాలకురాలుగ నేమింపఁ బడెను. ఆమెకు ఎప్పటియట్ల ఆలో చనసభ వారు, అనఁగా దివాను శేషాద్రి అయ్యరును మఱియిద్ద ఱు సభ్యులును, సహాయులుగ నుండిరి. 1901 వ సంవత్సరమున సర్ . పీ ఎన్. కృష్ణమూర్తి దివానయ్యెను. అతనికాలమున రాజు కీయోద్యోగస్థులకును మైసూరు ప్రతినిధి సభలోని సభ్యులకును పరస్పర విశ్వాసానురాగములు వృద్ధిపొండెను. 1902వ సంవ త్సరమున విద్యావంతుఁడును యుక్త వయస్కుఁడును నయి యుండిన కృష్ణ రాజ ఒడయరు లార్డుకర్జనుచే సింహాసనము నకుఁ బ్రక టింపఁ బడెను.

నాటినుండి యీమహా రాజు రాజ్యాంగ విషయములు జేసిన పరిశ్రమ మిక్కిలి యద్భతము. ఈతనికి మొదట సర్ పి. ఎన్. కృష్ణమూర్తియుఁ దరువాత.వి.పి. మాధవరావును దివానులుగ నుండిరి. ఇప్పటి దివాను . ఆనందరావు. వి. పి. మాధవరావు కాలమున శాసననిర్మాణసభ ప్రారంభమయ్యెను. అందు రాజుగారి ఆలోచన సభలోని మువ్వురు సభ్యులును జనులచే నిర్వచింపఁబడు నితర సభ్యులును గలరు. వీరు వివాహ