ఈ పుట అచ్చుదిద్దబడ్డది

318

మైసూరు రాజ్యము.


మార్గమున ననుసరింపఁబడెను. రెండవ భాగమున నాంగ్లేయ 'పరిపాలనా పద్ధతులు గొంచెము కొంచెముగ నవలంబింపఁబడఁ జొచ్చెను. మూఁడవ భాగమున సంపూర్ణ ముగ నాంగ్లేయ పద్ధ తులే నెలకొలుపఁ బడియెను. ఆంగ్లేయ ప్రభుత్వము మైసూరు నందారంభమగు నప్పుడు “ కమిషనరుల క్రింది యుద్యోగస్థు లందఱును స్వదేశీయులుగ నుండవలెను. ప్రస్తుతముగల స్వదే శీయ స్థాపనలు తప్పక సాగించన లెను” అని గవర్నరు జనరలు గారి యాజ్ఞ. దాని ననుసరించి మొదట నేపని కైనను స్వదేశీ యులే నేమింపఁబడుచు వచ్చిరి. కాని పరిపాలనా పద్ధతి నంతయు మార్చవలసిన యవసరము గానవచ్చుటం బట్టి ఆయనుజ్ఞ నతి క్రమించవలసెను. స్వదేశీయులుగ నుండుచు వచ్చిన ఫౌజుదారు లను మండలాధికారుల స్థానములకు నలుగురు ఐరోపియనులు నేమింపఁబడిరి. తరువాతి క్రమక్రమముగ సహాయోద్యోగులును ఐరోపియనులే యగుచువచ్చిరి.1854వ సంనత్సరమున నాంగ్లేయ రాజ్యాంగముల ననుసరించి విద్యాశాఖయు (Public Instruction) నిర్మాణశాఖ (Public worlks) యు నేర్పఱుపఁ బడెను.

మొదటి కమిషనరులలో పేరుఁ గన్న వాఁడు 'కుబ్బను'. ఇతఁడు పన్ను వసూలు పద్ధతులను సంస్కరించి ప్రజలకు 'బాధ లేకుండఁ జేసెను. కుల్నాడు సీమలోఁ బ్రబలముగ నుండిన బానిస వ్యాపారమును రద్దు చేసెను. న్యాయవిచారణ విషయ '