ఈ పుట అచ్చుదిద్దబడ్డది

322

మైసూరు రాజ్యము.


హళ్లియు, కృష్ణ రాజునకు కెంబళయును, బోళ శ్యామరాజు నకు మైసూరును ఇచ్చెను. మొదటి ఇద్దఱకును సంతతి లేక పోవుటవలన మైసూరు శాఖవారి కే మరల రాజ్యముతయుఁ జెందిపోయెను. కాని ఒక శాఖ నిలిచిపోయినపుడు రాజ్యము ఇతర శాఖల వారి కందుచు వచ్చుచున్నది. బంధుత్వములును నీమూఁడు శాఖలలో నే జరుగుచున్నవి. విజయనగర సామ్రాజ్య ము విచ్ఛిన్న మగు సమయమున మైసూరునందు పరిపాలకుఁడుగ నుండిన వాఁడు బోళ శ్యామరాజ ఒడయరు. ఇతఁడు శ్రీరంగ పట్న ములోని విజయనగర సంస్థాన ప్రతినిధికిఁ గప్పము గట్టక చల్లఁగ నెగ వేయ మొదలిడెను. ఇతనికి తరువాత రాజ ఒడయరు 1610 న సువత్సరమున శ్రీరంగ పట్న ప్రతినిధియగు ముసలి తిరుమల రాజును తలకాడునకుఁ బారదోలి ఆ పట్న మును స్వాధీనము చేసికొనెను. అదే రాజఒడయరు 1613లో ఉమ్మత్తూ రును లోఁబజచుకొని దాని యిలాకా భూములను మైసూరు నకుఁ జేర్చుకొనెను. అంతటి " దృప్తి చెందక ఇతఁడు త్తర మున జగ దేవరాయని పొలమునుగూడ కొంత ఆక్రమించు కొనెను. స్థానిక ప్రభువుల నణంచి రైతులను దనవారుగఁ జేసి కొను యోగ్యత ఇతనికిఁ గలుగుట జేసి యీతఁడు విజయుఁ డగుచు వచ్చెను. ఇతఁడే వైష్ణవ మతమవలంబించిన మైసూరు రాజులలో మొదటివాడు. ఇతని తరువాత రాజ్యమునకు వచ్చిన ఆరవశ్యామరాజ ఒడయరును ఇతని విధమునఁ బ్రవ