ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయాజీరావు III.

273


జాతుల వారికిని విద్యనందఁ జేయుట యందును (5) పాఠశాలల కొజుఱకు వస్తు ప్రదర్శనాగారముల నెలకొల్పుట యందును (6) దేశ భాషావాజ్మయము నభివృద్ధి చేయుటయందును శ్రద్ధ పుచ్చుకొని పని చేయనలసిన దనియును ఏర్పడెను. నాటినుండియే 'విద్యాలయములు గట్టించుటకుగాను బరోడా సంస్థాన ప్రభుత్వము వారు సంవత్సరమునకు నించుమిం చుగ నరువది వేలు వ్యయ పెట్ట నిశ్చయించుకొనిరి. ఈ త్తరువు కొంత కాలముసాగి దాని ఫలములు గనుపించిన తరువాత 1898న సంవత్సరమున గాయిక వాడు నిర్బంధ విద్యాపద్ధతిని అవ లంబింప నిశ్చయించుకొని ఒక్క తాలూ కాయం దంతయునుఁ దదనుగుణముగ బాఠ శాలల స్థాపించున ట్లు తరువు చేసెను. ఏడు సవత్సరములకు పైఁబడిన పిదప బాలురు పండ్రెండు సంవత్స రముల వఱకును బాలికలు: పదేండ్ల నఱకును. విద్యాలయము లుదువిద్య నభ్యసించి తీరవలసినదని నిర్బంధమగు కట్టుబాటు చేయఁబడెను. దాని నతిక్రమించిన తల్లిదండ్రులు కొద్దిపాటి జరి మానా నచ్చకొననలసినవారై .. బీదసాదల కీ నిబంధనవలన గస్టములు గలుగ కుండుటకయి మొదట నూటికి నలుబదిగురు బాలురవఱకును నుచితముగఁ పాఠశాలలయందుఁ జేర్చుకొనఁ బనుచువచ్చిః. కొంతకాలమైన పిదప నీ పాఠశాలలయందు నెల్లరకును ఉచితముగ విద్యగఱపఁబడఁజొచ్చెను. 1904వ సంవ త్సరమున నిర్బంధ విద్యాపద్ధతిని 'రాష్ట్రమున కంతకును