ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

బరోడా రాష్ట్రము.


తండ్రియుఁ బినతండ్రియు నెచ్చట దినానులుగఁ బని చేసి కీర్తి గాంచిరో ఆ తిరువాన్కూరు సంస్థానమునకు రాజకుమారు లిద్దఆకును విద్య నేర్పఁబోయెను. అచ్చట నె ముఖ్యమంత్రి సాహా య్యుఁడుగ నుండి తరువాత 1858లో ముఖ్యమంత్రి యయ్యెను. అప్పులలోఁబడి మతాచార్యుల చేతులఁ జిక్కి పోయియుండిన ఆసంస్థానమును జక్కగ సంస్కరించి వెట్టెను. 1878లో మహా రాజ హోల్కారు చే నాహూయమానుఁడయి యతనికి దివా నుగ నేగెను. అటనుండి బరోడా దుస్థితిందలంచి నాంగ్లేయ ప్రభుత్వము వారు పిలువ గాయిక వాడు సంస్థానమునకు ముఖ్య మంత్రిగా నుండి కార్యములు నడుపనంగీకరిం చెను

మలారి రావును గుఱించి వ్రాయు నెడ బరోడాయం దెట్టి యల్లకల్లోలము లుండినదియును వ్రాయఁబడియెనుగదా! ఆయ ల్లక కల్లోలములనణఁచి రాజ్య కార్యములను గ్రమమునకుఁ దెచ్చు. టలో నీమాధవరావు చేసిన కృషిని, పడిన పాట్లను, మాటలతో వర్ణించి మనసును సంతృప్తిపొందించుకొనుట దుర్లభము. మొట్ట మొదట నతఁడు రెవెన్యూ విషయములయందు సంస్కా రములకుఁ బూనెను. బరోడా సంస్థానము రెవెన్యూవసూలుకు గాను . ఖండములు ఖండములుగ కొన్ని సంవత్సరములకు గుత్తలకియ్యఁబడుచుండెనని ఇదివఱ కేనుడివితిమి. ఆగుత్తగాం డ్రకే సరదారులని పేరు. - వీరుమఱల సాహుకారులకు తమ ఇజారా ప్రదేశమును..చిన్న చిన్న భాగములుగ విభజించి యిచ్చు