ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లా ర్డు కర్జను.

201


స్థితి మజల 'నొకటి రెండు క్షామములు దటస్థించినచో దుర్భర మగునట్లు గాన్పించెను.

లార్డు కర్జను.

ఈ సందర్భములలో 1902 వ సంవత్సరమున లార్డు కర్జను హైదరాబాదునకు దర్శన మీయఁబోయెను. అంతకు మున్నె యతఁడు నైజాముతో నుత్తరప్రత్యుత్తరములు జరుపు చుండెను. పై యప్పులలోఁ గొంత భాగము 1901 వ సంవ. త్సరమున దీర్పఁబడియుండెను. అయినను 1902వ సంవత్స రము లార్డుకర్జను నైజాముతోఁ గలిసినప్పుడు ముఖాముఖ సంభా షణము జరిగెను. సర్ సాలారుజంగునకు అతని కాలమున ఇండి యా సెక్రటరీగా నుండిన లార్డు సాలిస్బరీ యిచ్చిన ప్రత్యుత్తరము లోనప్పటికీ బాలుఁడుగా నుండిన మీర్ మహబూబ్ యౌవనత్వ మందిన తరువాత నతఁడిచ్చయించె నేని ఆంగ్లేయులకును నైజా మునకును గలపరస్పర సంబంధములు సంపూర్ణముగ నాం గ్లేయ ప్రభుత్వమువారు మఱల విమర్శింపగలరు' అని వ్రాసిన వ్రాత నాధారము చేసికొని లార్డుకర్జనీవిషయమున జోక్యముకలుగఁ జేసికొనెను. అదే లార్డు సాలిస్బరీ ఆప్రత్యుత్తరమున నే 1858వ సంవత్సరపు సంధిలో బీరా రిన్ని సంవత్సరము లాంగ్లేయు లను భవింపవలసినదని లేదు గావున నాంగ్లేయుల కామండలము శాశ్వతముగఁ బరిపాలన కియ్యఁబడినది అని నుడివియుండుట వలనను, సర్వ జనులకును సమాన్యుఁడై మహా నిపుణుఁడగు సర్