ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

హైదరా బాదుసంస్థానము.


నైజాముగారి నిర్బంధమువలన ఇల్లు విడచి కదలలేకుండిన ఇత నికిఁ జక్కగ బ్రయాణములు సల్పి తన రాజ్యమున క్రింది అధి కా రు లెట్లు పనులు దీర్చు చుండుటయుఁ బరిశీలించుటయేగాక పర "రాష్ట్రములకుఁ బోయి నైజామునకు లాభకరములని తాను దలఁ చిన కార్యముల కై పాటుపడుటకును అచ్చటచ్చటి ఉత్తమ సాంఘిక 'రాజకీయా చారములను ఎరింగికొనుటకును వీలుకలి గెను. ఇట్టి నూతన స్వేచ్ఛ దొరకినందున సర్ సాలారు హృద యమం దడఁగియుండిన దేశభక్తి ' బయలునడి పొంగిపొరల మొదలిడెను. తన యజమానియగు నైజముపో నడచికొనిన బంగారు పుటల నీను బీరారు నె ట్లైనను మరల సంపాదింపవ లె నను ఆశ అతని డెందమున గాఢముగ నెలకొని యుండెను. 1860 న సంవత్సరపు సంధి ప్రకారము నైజాము బీరారుమండలమును గుఱించిన లెక్కలడుగు హక్కునుగూడ వదలు కొనియుండెను. ఆ ముండలనున కగువ్యయములు పోను నిలువ ఏమయిననున్న చో నా గ్లేయు లియ్యనియ్యకొని యుండిరి. ఇదియంతయు 'సర్ సాలారునకు సమ్మతము గాదని వేరుగనుడువ బని లేదు.

సాలార్జంగు. ప్రవర్తన.

ఇట నీ సమయమున సర్ సాలారుజంగు ప్రవర్తనను గుఱించి మాక్ ఔలిఫ్ అనుచరిత్రకారుఁడు వ్రాయునంశములు నుదాహరింప వలసియున్నది.