ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఫ్రెంచి వారి పలుకుబడికి భంగము.

135.


చిరి. నైజామునకును నాంగ్లేయులకును 1798 న సంవత్సరము మఱియొక సంధి జరిగెను. దానివలన నైజామునకు నాంగ్లేయులు రెండుపటాలములకు బదులు ఆరుపటాలములు సాహాయ్య మియ్య నంగీకరించిరి. నైజాము దన క్రింద జీతగాండ్రుగ నుండిన ఫ్రెంచివారల నందఱను పనులనుండి తొలఁగించి ఆంగ్లేయుల స్వాధీనము చేయ నొప్పుకొ నెను. ఆరుపటాలములకు నగు వ్యయ యము సంవత్సరమునకు రు 24, 17, 100లు. నైజాముగారి బొక్క సమునుండి నాలుగు కి స్తీలుగ నిచ్చునట్లేరుపరుపఁబడెను. మహా రాష్ట్రులకును నైజాముగారికిని మరల నే వేని భేదములు గలిగినచో నాంగ్లేయులు మధ్యవర్తులుగ నుండ నియమింపఁబ డిరి. ఆంగ్లేయులనుదక్క దక్కిన యైరోపియనులను నైజామగారి రాజ్యమునుండి వెడలగొట్టు విషయమున 1798వ సంవత్సరము నష్టంబరు నెల 1 వ తేది ప్రత్యేక మొక యొడంబడిక జరిగెను. దానిననుసరించి నైజాము రెసిడెంటుగారి యేర్పాటులకు నియ్య కొన నంగీకరిం చెను.

ఫ్రెంచివారి పలుకుబడికి భంగము.

అక్టోబరు నెల తొమ్మిదవ తేది నైజామున కెక్కుడుగ నాంగ్లేయు లియ్యదలఁచికొనిన నాలుగుపటాలములును హైద రాబాదు' వచ్చి చేరెను. రెసిడెంటుగారు సంధి ప్రకారము ఫ్రెంచిబలములను జెదరఁగొట్టవలసినదని - వేడిరి. కొన్ని దినములకాల మేమియు నడచినదిగాదు.ఫ్రెంచిపటాలముల