ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హిందూ దేశ విహారము

87

.

వీధులు చక్కగ నలంక రింప బడి జనులు గుంపులు గుంపులుగ మనోహరమగునుడువులు ధరించి మము నెదుర్కొను చుండినను, కొన్ని భాగములందు క్షామమువలనఁ బీడింపఁబడి దరిద్రులై కష్టము లందుచుండిన దురదృష్టులను మేము మఱవ లేదు. నేను గ్వాలియునందు దుర్భిక్షమువాతఁ బడకుండ సంరక్షింపఁబడు చుండిన 6000 జనమును పురుషులు స్త్రీ లు బిడ్డలను నొక్క యెడఁ జూచుటతటస్థించెను. అనగరమును గాంచుట దుఃఖకరముగ నే యుండెనుగాని, యాబీదలను గాపాడుటకుఁ చేయఁబడియుండిన సంపూర్ణ ప్రయత్నములఁ జూచిన నాకు సంతోషముగలిగెను. సామంత రాజుల రాష్ట్రములను జూచుట మా యనుభనములలో ముఖ్యతమముగను, నెక్కు. డానందదాయిగను గణింపఁ బడవ లెను. ఆయాప్రభువులును వారి వారి ప్రజలును మిక్కిలి యుత్సా హముతోడను గౌరవము తోడను మమ్మును సత్కరించిరి.. ... కొద్దిపాటి యనుభవముతో నామనస్సున భరత వర్షమును గుఱించి నిలచిన భావములను నునువుచున్నాను. భరతవర్షము నొక్క. దేశ ముగఁ బరిగణింపఁ గూడదు. అది రుప్యాదక్క దక్కిన కోపాఖండమునకు సమానమగు వి స్తీర్ణ ముగల ఖండము. జాతి మత భాషలచే భిన్ను లగు పెక్కు తెగల జనులు మొత్తమునకు 300, 000, 000 ఆఖండమున నివసించు చున్నారు. దాని యపరిమిత వి సతీర్ణమును, అద్భుత తేజంబును, మారుచుండెడి శీతోష్ణ స్థితియు, అందలి విస్తారమగు నెడారు