పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/82

ఈ పుట ఆమోదించబడ్డది

74 చిన్ననాటి ముచ్చట్లు

పోయి వివాహాది శుభకార్యములు చేసుకొనుచుండిరి. ఇప్పడు మద్రాసులో పనులు గలవారు ఇండ్లను నిర్మించుకొని ఆరోగ్యమునకై అక్కడ నివసించుచున్నారు.

మద్రాసులోనుండు జనులు చాలవరకు బాడుగ యిండ్లలోనే నివసించువారగుటవలన, యెవరైనను ఆయింటిలో చనిపోయిన కర్మాంతరములను జరిపించుటకు యితర కాపురస్తులు ఒప్పకొనేవారుకారు. ఈ కారణమువలన మద్రాసులోనివారు చాల యిబ్బంది పడుచుండిరి. ఈ కార్యములను చేయుటకు ధర్మసత్రములను యిచ్చెడివారు కారు. ఇట్టి కష్టములను ముఖ్యముగ బ్రాహ్మణులే అనుభవించుచుండిరి.

ఈ కష్టములను చూచి యొక బ్రాహ్మణోత్తముడు రాయపురములో ఒక చిన్న తోటను అందు ఒక యిల్లును ఇచ్చి, ఈ కార్యములను అక్కడ చేయుటకు తగు యేర్పాటులను చేసి పుణ్యమును కట్టుకొనెను. ఈ బ్రహ్మతీర్ధమునందు బ్రాహ్మణులు మాత్రమే అపరక్రియలను జరుపుకొన వచ్చును. ఈ చిన్నప్రదేశము ఇప్పడు బ్రహ్మాండమైన బ్రహ్మసత్రముగ మారినది. గనుక ప్రతిదినము ఈ బ్రహ్మసత్రమునందు పది పన్నెండుకర్మలు జరుగుచున్నవి. వీరందరికి ఇక్కడ తగువసతులు యేర్పాట్లు గలవు. అందరికి కావలసిన పాత్రసామానులు కూడ యిక్కడ యిచ్చెదరు. కొందరు ధనికుల కర్మలను ఇక్కడ జరిపించిన పిమ్మట చనిపోయిన వారి పేరట ఒక చిన్నయింటిని ఈతోటలో కట్టించి యిచ్చెదురు. ఈ ప్రకారము ఈతోటలో వసతులు పెరిగిపోవుచున్నవి.

పల్లెటూళ్లలో చనిపోయినవారి కర్మ చేయించుటకు, బ్రాహ్మణార్ధములకు ముత్తయిదువులు మొదలగు వార్లకు చాల కష్టపడవలయును. ఈ బ్రహ్మతీర్ధమునందు ఆలాటి కష్టములు పడవలసిన పనిలేదు. పురోహితులు,