ఈ పుట ఆమోదించబడ్డది
2 వ అనుబంధము
81
జపాను వలెనే ఇటలీకూడ తనపూర్వపు ఔన్నత్యమును నిలబెట్టుకొనుటకు జనాభాను పెంచుకోవలసి వచ్చెను.1816 లోఇటలీలో రమారమి 2 కోట్లే జనాభావున్నారు.అప్పటినుంచి తన జనాభాను యిా దిగువరీతిగ వృద్ధిజేసికొనెను.
సంవత్సరాలు | జనాభా | సంవత్సరాలు | జనాభా |
1872 | 26,801,154 | 1926 | 39,349,000 |
1882 | 28,459,628 | 1930 | 40,759,000 |
1901 | 32,475,253 | 1933 | 41,806,000 |
1911 | 34,674,377 | 1934 | 42,217,000 |
1921 | 38,033,000 | 1935 | 42,621,000 |
దామాయిషాను ఏడాదికి 4లక్షల చొ||జనాభాను పెంచగలిగెను.
ఇటలీ తన జనాభాకు తగిన ఆర్ధిక సౌష్టవమును కలిగించుటకు ఆఫ్రికా దేశమును,మహమ్మదీయ రాజ్యా లను, క్రమేణ భారత దేశమును కబళించాలనే కాంక్ష పుట్టినది. ఇందుకు తగినట్లుగా ఇటలీని పరిపాలించె మస్సోళినీ నియంత(1935-40)మధ్య మహాసంగ్రామం రాక తప్పదనియు, ఈ యిరువదవ శతాబ్దిలో శాంతి అనేది వుందదనియు చాటుచుండెను.దీనికి తార్కాణమే 1936 లో ఆఫ్రికాలోని అబిసీనియా దేశమును కబళించెను. ఇదివరకే ఆఫ్రికాలో కొన్ని ప్రదేశాలు ఇటలీ